By ETV Bharat Andhra Pradesh Team
Published : 2 hours ago
"కృష్ణమ్మ మెరిసింది" - "దుర్గమ్మ మురిసింది" - నయనమనోహరంగా నిత్యహారతుల పునప్రారంభం - Nityaharti at Krishna River Begins
Nityaharti at Krishna River Begins Again : దేవీనవరాత్రుల సందర్భంగా కృష్ణానది వద్ద నిత్యహారతులు మళ్లీ ప్రారంభం కానున్నాయి. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో గోదావరి పుష్కరాల సమయంలో అఖండ గోదావరి హారతి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అదే స్ఫూర్తితో గోదావరి నీరు- కృష్ణలో కలిసే ఇబ్రహీంపట్నంలోని పవిత్ర సంగమం వద్ద కృష్ణాపుష్కరాల నుంచి ప్రతి రోజు నవహారతులను నయానందకరంగా నిర్వహించారు.
గత ప్రభుత్వం హారతులను పూర్తిగా నిలిపివేసింది. ఇంద్రకీలాద్రి దిగువన దుర్ఘాఘాట్ వద్ద కొన్నాళ్లు హారతుల కార్యక్రమాన్ని చేపట్టినా మొక్కుబడి తంతుగానే సాగించింది. మహాకూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దసరా నుంచి కృష్ణానదికి నిత్యహారతులను పునప్రారంభించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. పవిత్ర సంగమం వద్దే వీటిని నిర్వహించాలని తొలుత భావించినా అనుకోని వరదల కారణంగా ప్రస్తుతం దుర్గాఘాట్ వద్ద హారతులు మళ్లీ భక్తులకు నయనమనోహరం కానున్నాయి. అమ్మవారిని సృష్టి స్వరూపిణిగా పిలుస్తుంటాం. ఓంకార నాదంతో నవ హారతులు ప్రారంభించి నాగ హారతి, పంచ హారతి, కుంభ హారతి, సింహ హారతి, నంది హారతి, సూర్య హారతి, చంద్ర హారతి, నక్షత్ర హారతులతో కృష్ణమ్మకు- కనకదుర్గమ్మకు నీరాజనాలు అర్పించబోతున్నారు. ఇప్పటికే ట్రయిల్రన్ విజయవంతంగా పూర్తి చేశారు.