ETV Bharat / state

ఘనంగా రహదారి భద్రతా వారోత్సవాల ముగింపు - కడప ఆర్టీసీ గ్యారేజ్​లో రహదారి భద్రతా వారోత్సవాల ముగింపు

రహదారి భద్రతా వారోత్సవాల ముగింపును కడపలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఆర్టీసీ డ్రైవర్లు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

road safety awareness program
కడప ఆర్టీసీ గ్యారేజ్​లో రహదారి భద్రతా వారోత్సవాల ముగింపు
author img

By

Published : Jan 28, 2020, 10:00 AM IST

రహదారి భద్రతా వారోత్సవాల ముగింపు కార్యక్రమం
31వ రహదారి భద్రతా వారోత్సవాల ముగింపు కార్యక్రమం కడప ఆర్టీసీ గ్యారజ్​లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఓఎస్​డీ లక్ష్మీనారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రస్తుతం రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా మానవ తప్పిదాల వల్లే జరుగుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఆర్టీసీపై ఇప్పటికీ ప్రజలకు నమ్మకముందన్నారు. చాలా మంది డ్రైవర్లు సెల్​ఫోన్​ మాట్లాడుతూ, బస్సులు నడుపుతున్నారనీ... ఇది పెద్ద తప్పిదమని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ ప్రమాదాల వల్ల 600 మంది మృతి చెందినట్లు వెల్లడించారు. ప్రమాదాలు నివారిస్తే ఆర్టీసీ మరింత ముందుకు వెళ్తుందన్నారు. విధుల్లోకి చేరి ఒక్క రోడ్డు ప్రమాదం చేయకుండా ఉన్న ఆర్టీసీ డ్రైవర్లను మెచ్చుకుంటూ, బహుమతులు అందజేశారు. వీరిని మిగతా డ్రైవర్లు ఆదర్శవంతంగా తీసుకోవాలని సూచించారు.

ఇదీ చదవండి:

గణతంత్ర వేడుకలు నిర్వహణకు విద్యార్థుల చేత వెట్టిచాకిరీ

రహదారి భద్రతా వారోత్సవాల ముగింపు కార్యక్రమం
31వ రహదారి భద్రతా వారోత్సవాల ముగింపు కార్యక్రమం కడప ఆర్టీసీ గ్యారజ్​లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఓఎస్​డీ లక్ష్మీనారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రస్తుతం రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా మానవ తప్పిదాల వల్లే జరుగుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఆర్టీసీపై ఇప్పటికీ ప్రజలకు నమ్మకముందన్నారు. చాలా మంది డ్రైవర్లు సెల్​ఫోన్​ మాట్లాడుతూ, బస్సులు నడుపుతున్నారనీ... ఇది పెద్ద తప్పిదమని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ ప్రమాదాల వల్ల 600 మంది మృతి చెందినట్లు వెల్లడించారు. ప్రమాదాలు నివారిస్తే ఆర్టీసీ మరింత ముందుకు వెళ్తుందన్నారు. విధుల్లోకి చేరి ఒక్క రోడ్డు ప్రమాదం చేయకుండా ఉన్న ఆర్టీసీ డ్రైవర్లను మెచ్చుకుంటూ, బహుమతులు అందజేశారు. వీరిని మిగతా డ్రైవర్లు ఆదర్శవంతంగా తీసుకోవాలని సూచించారు.

ఇదీ చదవండి:

గణతంత్ర వేడుకలు నిర్వహణకు విద్యార్థుల చేత వెట్టిచాకిరీ

Intro:ap_cdp_18_27_rtc_samavesham_av_vo_ap10040
రిపోర్టర్: సుందర్, ఈటీవీ కంట్రిబ్యూటర్, కడప.

యాంకర్:
ప్రస్తుతం జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువ శాతం మానవ తప్పిదాల వల్ల జరుగుతున్నాయని ఓ ఎస్ డి లక్ష్మీనారాయణ అన్నారు. కడప ఆర్టీసీ గ్యారేజ్ లో నిర్వహించిన 31వ రహదారి భద్రతా వారోత్సవాల ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఆర్టీసీ అంటే ప్రజలు ఇప్పటికీ నమ్మకముందని చెప్పారు. కానీ చాలామంది ఫోన్లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తున్నారని ఇది మహా తప్పిదం అని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఏటా ఆర్టీసీ ప్రమాదాల వల్ల 600 మంది మృతి చెందుతున్నారని పేర్కొన్నారు. ప్రమాదాలను నివారిస్తే ఆర్టీసీ సంస్థ మరింత ముందుకు వెళ్తుందని పేర్కొన్నారు. ఇప్పటివరకు ఒక్క రోడ్డు ప్రమాదం చెయ్యను డ్రైవర్లు ఉండటం నిజంగా అభినందనీయమన్నారు. అలాంటి వారిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని పేర్కొన్నారు.


Body:ఆర్టీసీ సమావేశం


Conclusion:కడప

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.