ETV Bharat / state

'కొవిడ్‌ చికిత్స కేంద్రంతో పాటు.. ఐసోలేషన్ కేంద్రం ఏర్పాటు చేయాలి'

author img

By

Published : May 11, 2021, 9:43 PM IST

కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గంలో ఐసోలేషన్ కేంద్రం ఏర్పాటు చేయాలని తహసీల్దారు ప్రేమంతకుమార్‌ను భాజపా నాయకులు కోరారు. ఈ మేరకు వినతిపత్రం అందించారు.

bjp leaders
వినతిపత్రం అందిస్తున భాజపా నేతలు

కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గంలో కొవిడ్‌ కేసులు పెరుగుతున్నాయి. కొవిడ్‌ చికిత్స కేంద్రంతో పాటు.. ఐసోలేషన్ కేంద్రం ఏర్పాటు చేయాలని భాజపా నాయకులు కోరారు. వైరస్​ సోకి... హోమ్ ఐసోలేషన్​లో ఉన్న వారికి సరైన వసతులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు. శాశ్వత కొవిడ్‌ పరీక్షా కేంద్రం ఏర్పాటు చేయాలని కోరారు.

కొవిడ్‌ బాధితులు వైద్యం కోసం కడప, ప్రొద్దుటూరు పట్టణాలతో పాటు కర్నూలుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉందన్నారు. ఈ మేరకు పార్టీ జిల్లా కార్యదర్శి పి.శ్రీధర్ బాబు, జాతీయ మాజీ కౌన్సిల్ సభ్యుడు బీపీ వెంకట ప్రతాపరెడ్డి మైదుకూరు తహసీల్దారు ప్రేమంతకుమార్‌కు వినతిపత్రం అందజేశారు. వెంటనే విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాలని చెప్పారు.

కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గంలో కొవిడ్‌ కేసులు పెరుగుతున్నాయి. కొవిడ్‌ చికిత్స కేంద్రంతో పాటు.. ఐసోలేషన్ కేంద్రం ఏర్పాటు చేయాలని భాజపా నాయకులు కోరారు. వైరస్​ సోకి... హోమ్ ఐసోలేషన్​లో ఉన్న వారికి సరైన వసతులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు. శాశ్వత కొవిడ్‌ పరీక్షా కేంద్రం ఏర్పాటు చేయాలని కోరారు.

కొవిడ్‌ బాధితులు వైద్యం కోసం కడప, ప్రొద్దుటూరు పట్టణాలతో పాటు కర్నూలుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉందన్నారు. ఈ మేరకు పార్టీ జిల్లా కార్యదర్శి పి.శ్రీధర్ బాబు, జాతీయ మాజీ కౌన్సిల్ సభ్యుడు బీపీ వెంకట ప్రతాపరెడ్డి మైదుకూరు తహసీల్దారు ప్రేమంతకుమార్‌కు వినతిపత్రం అందజేశారు. వెంటనే విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాలని చెప్పారు.

ఇదీ చదవండి:

ఆక్సిజన్ కేటాయింపు, సరఫరా పెంచాలంటూ.. ప్రధానికి సీఎం జగన్ లేఖ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.