అంతర్జాతీయ "ఎర్ర"దొంగ అరెస్ట్ తమిళనాడుకు చెందిన అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ వీర రాజ్ కుమార్ను కడప పోలీసులు చెన్నైలో అరెస్టు చేశారు. ఇటీవలకడప జిల్లా కోడూరు అటవీ ప్రాంతంలోముగ్గురు ఎర్రచందన స్మగ్లర్లనుపోలీసులు అరెస్టు చేశారు. వారిని విచారించగా...అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ వీర రాజ్ కుమార్ సమాచారం బయపడింది. వెంటనే స్పందించిన పోలీసులుచెన్నైలో అతను నివాసం ఉంటున్న ప్రాంతానికి చేరుకొని అరెస్టు చేశారు.వీర రాజ్కుమార్పైకడప, చిత్తూరు జిల్లాల్లో సుమారు 40 కేసులు నమోదై ఉన్నాయి
గతంలో బావ.. ఇప్పుడు బావమరిది అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ను అదుపులోకి తీసుకున్న కడపజిల్లా పోలీసులకుఆసక్తికర విషయం తెలిసింది. గతంలో చిక్కిన ఎర్రచందనం స్మగ్లర్ పార్తీబన్... ఇప్పుడు అరెస్టైన వీర రాజ్కుమార్బావ-బావమరిది. వీర రాజ్కుమార్కు చెన్నైలో రూ. 4 కోట్ల ఆస్తులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. స్మగ్లర్ల నుంచి లారీ, ఇన్నోవా, 66 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు.