ETV Bharat / state

కడప జిల్లాలో పెద్ద ఎత్తున ఎర్రచందనం దుంగలు పట్టివేత

author img

By

Published : Nov 22, 2019, 3:23 PM IST

కడప జిల్లా రాజంపేట, ప్రొద్దుటూరు అటవీ ప్రాంతాలలో తనిఖీలు నిర్వహిస్తుండగా పెద్దఎత్తున ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

పోలీసులు స్వాధీనం చేసుకున్న ఎర్రచందనంస్మగ్లర్లు
కడపజిల్లాలో పెద్దఎత్తున ఎర్రచందనం పట్టివేత

కడప జిల్లాలో అటవీ శాఖ అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు.రాజంపేట అటవీ ప్రాంతంలో 5 ఎర్రచందనం దుంగలతోపాటు స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. రోళ్లమడుగు జలకోన ప్రాంతంలో ముందస్తు సమాచారం మేరకు... తమిళనాడుకు చెందిన దొరై, శివ అనే వ్యక్తులను పట్టుకున్నామని అటవీశాఖ రేంజర్ నయీమ్ అలీ చెప్పారు. జిల్లాలోని ప్రొద్దుటూరు అటవీ డివిజన్ పరిధిలోని బలసింగాయపల్లె వద్ద అటవీశాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఎర్రచందనాన్ని అక్రమంగా తరలించేందుకు సిద్ధమైన.... 26 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. అటవీ అధికారులను చూసి... తమిళ కూలీలు పారిపోయారు. స్మగ్లర్లలో 24 మంది తప్పించుకోగా... ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. దుంగల విలువ రూ. 3 లక్షలకు పైగా ఉంటుందని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రవికుమార్ వెల్లడించారు.

ఇదీచూడండి.కడప గడపలో అక్రమ బంగారం.. 7 కిలోలు పట్టివేత

కడపజిల్లాలో పెద్దఎత్తున ఎర్రచందనం పట్టివేత

కడప జిల్లాలో అటవీ శాఖ అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు.రాజంపేట అటవీ ప్రాంతంలో 5 ఎర్రచందనం దుంగలతోపాటు స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. రోళ్లమడుగు జలకోన ప్రాంతంలో ముందస్తు సమాచారం మేరకు... తమిళనాడుకు చెందిన దొరై, శివ అనే వ్యక్తులను పట్టుకున్నామని అటవీశాఖ రేంజర్ నయీమ్ అలీ చెప్పారు. జిల్లాలోని ప్రొద్దుటూరు అటవీ డివిజన్ పరిధిలోని బలసింగాయపల్లె వద్ద అటవీశాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఎర్రచందనాన్ని అక్రమంగా తరలించేందుకు సిద్ధమైన.... 26 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. అటవీ అధికారులను చూసి... తమిళ కూలీలు పారిపోయారు. స్మగ్లర్లలో 24 మంది తప్పించుకోగా... ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. దుంగల విలువ రూ. 3 లక్షలకు పైగా ఉంటుందని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రవికుమార్ వెల్లడించారు.

ఇదీచూడండి.కడప గడపలో అక్రమ బంగారం.. 7 కిలోలు పట్టివేత

Intro:Ap_cdp_41_21_errachandanam_pattivetha_avb_ap10041
Place: proddatur
Reporter: madhusudhan

ఎర్రచందనాన్ని అక్రమంగా తరలించేందుకు సిద్దం చేసిన కూలీల పై ఆటవీ శాఖ అధికారులు పంజా విసిరారు.
విలువైన ఎర్రచందనం దుంగలను అక్రమ రవాణా చేస్తున్నట్లు సమాచారం అందడంతో అధికారులు దాడులు చేసి వ్యక్తిని, దుంగలను స్వాధీనం చేసుకున్నారు. కడపజిల్లా ప్రొద్దుటూరు అటవీ డివిజన్ పరిధిలోని బలసింగాయపల్లె బీట్ వద్ద రాబడిన సమాచారం మేరకు అటవీశాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఎర్రచందనాన్ని అక్రమంగా తరలించేందుకు సిద్ధమయ్యారు. సమాచారం అందుకున్న అధికారులు అక్కడికి చేరుకున్నారు. తమిళ కూలీలు అటవీ అధికారులను చూసి పారిపోయారు. 24 మంది తప్పించుకోగా ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి 26 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. దుంగల విలువ 3 లక్షల రూపాయలకు పైగా ఉంటుందని అధికారులు వెల్లడించారు.

బైట్: రవికుమార్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, పొద్దుటూరుBody:AConclusion:A
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.