ETV Bharat / state

ఎర్ర చందనం దుంగలు స్వాధీనం... కంటైనర్​ సీజ్​

author img

By

Published : Dec 20, 2020, 12:12 PM IST

కంటైనర్​లో అక్రమంగా తరలించేందుకు సిద్ధంగా ఉంచిన 29 ఎర్రచందనం దుంగలను పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటన కడప జిల్లా రాజంపేట అటవీ రేంజ్​ పరిధిలోని పల్లంగేరు వద్ద జరిగింది.

red sandle
ఎర్ర చందనం దుంగలు స్వాధీనం... కంటైనర్​ సీజ్​

కంటైనర్​లో అక్రమంగా తరలించేందుకు సిద్ధంగా ఉంచిన 29 ఎర్రచందనం దుంగలను అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కడప జిల్లా రాజంపేట అటవీ రేంజ్​ పరిధిలోని పుల్లంగేరు వద్ద ఎర్రచందనం దుంగల కంటైనర్​ను పట్టుకుని సీజ్​ చేసినట్లు డీఎఫ్​వో నరసింహారావు తెలిపారు. 29 ఎర్రచందనం దుంగల బరువు 899 కిలోలని ఆయన తెలిపారు. ఈ వాహనం కర్ణాటక ప్రాంతం నుంచి అనంతపురం, కడప మీదుగా తమిళనాడు లోని కోయంబత్తూర్​కు వెళ్తున్నట్లు విచారణలో తెలిసిందన్నారు. దీని వెనుక తమిళనాడుకు చెందిన స్మగ్లర్లు ఉన్నారనే అనుమానం ఉందని, వారికి స్థానిక స్మగ్లర్లు ఎవరైనా సహకరిస్తున్నారనే కోణంలో విచారణ చేపట్టామని అన్నారు.

కంటైనర్​లో అక్రమంగా తరలించేందుకు సిద్ధంగా ఉంచిన 29 ఎర్రచందనం దుంగలను అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కడప జిల్లా రాజంపేట అటవీ రేంజ్​ పరిధిలోని పుల్లంగేరు వద్ద ఎర్రచందనం దుంగల కంటైనర్​ను పట్టుకుని సీజ్​ చేసినట్లు డీఎఫ్​వో నరసింహారావు తెలిపారు. 29 ఎర్రచందనం దుంగల బరువు 899 కిలోలని ఆయన తెలిపారు. ఈ వాహనం కర్ణాటక ప్రాంతం నుంచి అనంతపురం, కడప మీదుగా తమిళనాడు లోని కోయంబత్తూర్​కు వెళ్తున్నట్లు విచారణలో తెలిసిందన్నారు. దీని వెనుక తమిళనాడుకు చెందిన స్మగ్లర్లు ఉన్నారనే అనుమానం ఉందని, వారికి స్థానిక స్మగ్లర్లు ఎవరైనా సహకరిస్తున్నారనే కోణంలో విచారణ చేపట్టామని అన్నారు.

ఇదీ చదవండి: గువ్వలచెరువు ఘాట్​రోడ్​ వద్ద ప్రమాదం.. ఒకరు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.