రసీదు లేని 12 లక్షల రూపాయల విలువచేసే 20 కిలోల వెండి ఆభరణాలతో పాటు లక్ష రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కడప ఒకటో పట్టణ పోలీస్ సేష్టన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. రాత్రి సమయంలో లాడ్జిలను ఆకస్మికంగా తనిఖీ చేస్తుండగా... నగరంలోని శ్రీనివాస లాడ్జి లో తమిళనాడు రాష్ట్రం సేలం జిల్లాకు చెందిన నందకిషోర్...ఈ నగదుతో కనిపించారు.
ఆభరణాలకు సంబంధించిన రసీదులు చూపించాలని పోలీసులు అడిగారు. కానీ అతని వద్ద ఎలాంటి రసీదులు లేకపోవడంతో ...వాటిని స్వాధీన పరచుకుని ఆదాయ పన్ను శాఖ వారికి అప్పగించారు. రసీదులు లేకపోవడంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతుందని అన్నారు. ఎవరైనా ఆభరణాలు విక్రయించాలంటే రసీదులు తప్పనిసరిగా ఉండాలని లేదంటే కేసులు నమోదు చేస్తామని చెప్పారు.
ఇదీ చదవండీ...