ETV Bharat / state

చెట్టు కింద వైద్యం... అవస్థలు పడుతున్న రోగులు

author img

By

Published : Nov 12, 2020, 3:08 PM IST

Updated : Nov 12, 2020, 5:24 PM IST

ఆసుపత్రి మరమ్మతులతో వైద్యం చెట్టు కిందకు చేరింది. ఆసుపత్రిలో పనులు జరుగుతున్న కారణంగా ఆరుబయటే బెడ్​లు వేసి చికిత్స చేస్తున్నారు. వర్షం వస్తే పరిస్థితి ఏంటని రోగులు ప్రశ్నిస్తున్నారు. పనులు పూర్తయ్యే లోపు తాత్కాలిక సదుపాయాలు కల్పించాలని కోరుతున్నారు.

erraguntla phc
erraguntla phc
చెట్టు కింద వైద్యం... అవస్థలు పడుతున్న రోగులు

కడప జిల్లా ఎర్రగుంట్ల మండల ప్రాథమిక ఆరోగ్యకేంద్రం ఆవరణలోని చెట్ల కింద వైద్యం చేస్తున్నారు. ఆసుపత్రిలో మరమ్మతులు జరుగుతుండడం వల్ల ఆరుబయటే చికిత్స అందిస్తున్నామని వైద్య సిబ్బంది తెలిపారు. పనులు జరుగుతున్న కారణంగా విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ఆసుపత్రిలో చీకటిగా ఉందని బెడ్​లు బయటవేసి చికిత్స అందిస్తున్నామని సిబ్బంది అంటున్నారు.

ఆసుపత్రి వెనుకవైపు ఆయుష్ రూమ్ ఉందని అక్కడ వైద్యం చేస్తే బాగుంటుందని రోగులు అంటున్నారు. చెట్ల కింద వైద్యం చేయడంతో చికిత్స కోసం వచ్చిన మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. ఖాళీగా ఉన్న ఆయుష్ రూమ్​లో వైద్య చేయకపోవడాని కారణమేమిటో తెలియడం లేదని ప్రజలు అంటున్నారు. ఒక వేళ వర్షం వస్తే రోగుల పరిస్థితి ఏమిటని వారి బంధువులు ప్రశ్నిస్తున్నారు. త్వరగా పనులు పూర్తి చేస్తామని గుత్తేదారు చెబుతున్నారు. పనులు పూర్తయ్యే వరకు వేరొక సదుపాయం కల్పించాలని రోగులు కోరుతున్నారు.

ఇదీ చదవండి

సలాం కుటుంబానిది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే: చంద్రబాబు

చెట్టు కింద వైద్యం... అవస్థలు పడుతున్న రోగులు

కడప జిల్లా ఎర్రగుంట్ల మండల ప్రాథమిక ఆరోగ్యకేంద్రం ఆవరణలోని చెట్ల కింద వైద్యం చేస్తున్నారు. ఆసుపత్రిలో మరమ్మతులు జరుగుతుండడం వల్ల ఆరుబయటే చికిత్స అందిస్తున్నామని వైద్య సిబ్బంది తెలిపారు. పనులు జరుగుతున్న కారణంగా విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ఆసుపత్రిలో చీకటిగా ఉందని బెడ్​లు బయటవేసి చికిత్స అందిస్తున్నామని సిబ్బంది అంటున్నారు.

ఆసుపత్రి వెనుకవైపు ఆయుష్ రూమ్ ఉందని అక్కడ వైద్యం చేస్తే బాగుంటుందని రోగులు అంటున్నారు. చెట్ల కింద వైద్యం చేయడంతో చికిత్స కోసం వచ్చిన మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. ఖాళీగా ఉన్న ఆయుష్ రూమ్​లో వైద్య చేయకపోవడాని కారణమేమిటో తెలియడం లేదని ప్రజలు అంటున్నారు. ఒక వేళ వర్షం వస్తే రోగుల పరిస్థితి ఏమిటని వారి బంధువులు ప్రశ్నిస్తున్నారు. త్వరగా పనులు పూర్తి చేస్తామని గుత్తేదారు చెబుతున్నారు. పనులు పూర్తయ్యే వరకు వేరొక సదుపాయం కల్పించాలని రోగులు కోరుతున్నారు.

ఇదీ చదవండి

సలాం కుటుంబానిది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే: చంద్రబాబు

Last Updated : Nov 12, 2020, 5:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.