నేతన్న నేస్తం పథకానికి తమను వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్లు అనర్హులుగా గుర్తించారంటూ కడప జిల్లా ప్రొద్దుటూరులో చేనేతలు ఆందోళన చేపట్టారు. సోములవారిపల్లె, పెద్దశెట్టిపల్లె, దొరసానిపల్లెకు చెందిన చేనేత మహిళలు ఎంపీడీవో కార్యాలయానికి చేరుకుని... ఎంపీడీవో సుబ్రహ్మణ్యంకు ఫిర్యాదు చేశారు. వైకాపా నాయకులు బంగారు మునిరెడ్డి శేఖర్ నేతృత్వంలో నిరసన తెలిపారు.
నిబంధనల ప్రకారం అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ లబ్ధి చేకూరే విధంగా చూడాలని వైకాపా నాయకులు కోరారు. అయితే తాము ప్రభుత్వ నిబంధనల ప్రకారం పనిచేస్తున్నామని సచివాలయ ఉద్యోగులు చెప్తున్నారు. తమపై రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయని ఆరోపించారు. ఈ విషయంపై ఈ నెల 23న ఎంపీడీవోకు వినతిపత్రం అందించామన్నారు.
ఇవీ చదవండి...