ETV Bharat / state

రాత్రి టిప్పర్​ క్యాబిన్​లో నిద్ర.. తెల్లారేసరికి మృతి - చిలమకూరు ఐసీఎల్ ఫ్యాక్టరీ

టిప్పర్​లో నిద్రిస్తున్న వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం చిలమకూరు ఐసీఎల్ ఫ్యాక్టరీ వద్ద చోటు చేసుకుంది. క్యాబిన్​లో నిద్రపోయిన అతన్ని తెల్లవారుజామున తోటి డ్రైవర్లు లేపడానికి ప్రయత్నించగా.. జీవచ్ఛవంగా ఉండటంతో పోలీసులకు సమాచారం అందించారు.

man died in lorry cabin in yerraguntla
టిప్పర్​లో నిద్రిస్తున్న డ్రైవర్ మృతి
author img

By

Published : Jan 10, 2021, 3:59 PM IST

కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం చిలమకూరు ఐసీఎల్ ఫ్యాక్టరీ బయట నిలిపి ఉన్న టిప్పర్​లో నిద్రిస్తున్న నాగార్జున (30) అనే డ్రైవర్ మృతి చెందాడు. రాత్రి టిప్పర్ క్యాబిన్​లోనే నిద్రిస్తూ ఉదయానికల్లా మృతి చెందినట్లు తోటి డ్రైవర్లు తెలిపారు. పోలీసులకు సమాచారం ఇవ్వగా.. అక్కడికి చేరుకున్న పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. మృతుడు ఎర్రగుంట్ల పట్టణంలోని నారాయణ నగర్​కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. అతనికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భర్త మరణవార్త విని ఇద్దరు పిల్లలతో అక్కడికి చేరకున్న భార్య కన్నీరుమున్నీరైన తీరు స్థానికులను కలచివేసింది.

కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం చిలమకూరు ఐసీఎల్ ఫ్యాక్టరీ బయట నిలిపి ఉన్న టిప్పర్​లో నిద్రిస్తున్న నాగార్జున (30) అనే డ్రైవర్ మృతి చెందాడు. రాత్రి టిప్పర్ క్యాబిన్​లోనే నిద్రిస్తూ ఉదయానికల్లా మృతి చెందినట్లు తోటి డ్రైవర్లు తెలిపారు. పోలీసులకు సమాచారం ఇవ్వగా.. అక్కడికి చేరుకున్న పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. మృతుడు ఎర్రగుంట్ల పట్టణంలోని నారాయణ నగర్​కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. అతనికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భర్త మరణవార్త విని ఇద్దరు పిల్లలతో అక్కడికి చేరకున్న భార్య కన్నీరుమున్నీరైన తీరు స్థానికులను కలచివేసింది.

ఇదీ చదవండి: చేయని నేరానికి పోలీసులు వేధిస్తున్నారంటూ.. యువకుడి ఆత్మహత్యాయత్నం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.