లక్కీ డిప్ ద్వారా ఇళ్ల స్థలాలా కేటాయింపు - latest news on land to poor in maidhukuru
నిరుపేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపు పారదర్శకంగా ఉండేలా లక్కీ డిప్ ద్వారా అప్పగించనున్నట్లు కడప జిల్లా మైదుకూరు ఎమ్మెల్యే రఘురాం రెడ్డి తెలిపారు. ఇంటి స్థలాలు కేటాయించడమే కాకుండా గృహ నిర్మాణానికి రుణ సదుపాయంతో పాటు ప్రభుత్వం తరఫున ఉచితంగా 2.5 లక్షలు ఇవ్వనున్నట్లు తెలిపారు. మైదుకూరు మండలం గంజికుంటలో లక్కీ డిప్ నిర్వహించి ఇంటి స్థలాలు కేటాయించారు. ఈ నెల 25 ఉగాది రోజున లబ్ధిదారులకు పట్టాలు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.