ETV Bharat / state

ప్లాస్టిక్‌ కవర్‌లో మందులు... గొడుగు కింద చికిత్స..! - bad position in railway kodur vetarnity hospital

ఆ పశువైద్యశాల ఎండాకాలమే బాగుంటుంది. వానాకాలం వచ్చిందా... చిత్తడి చిత్తడే. కూర్చుందామంటే చుట్టూ నీళ్లు. కంప్యూటర్లు తడవకుండా బ్యానర్లు. గొడుగు కింద వైద్యం. ఇది... కడప జిల్లా రైల్వేకోడూరులోని పశువైద్యశాల దుస్థితి.

kapada railway kodur vetarnity hospital position
పశువైద్యశాల పరిస్థితి
author img

By

Published : Dec 3, 2019, 5:33 PM IST

ప్లాస్టిక్‌ కవర్‌లో మందులు... గొడుగు కింద చికిత్స..!

కడప జిల్లా రైల్వేకోడూరులోని పశు వైద్యశాల ఎంతో ప్రసిద్ధి చెందింది. కానీ ఇప్పుడు అది సమస్యల వలయంలో చిక్కుకుంది. 35ఏళ్ల ముందు నిర్మించిన వైద్యశాల భవనం శిథిలావస్థకు చేరింది. గోడలు ఎప్పుడు పడిపోతాయో తెలియని పరిస్థితి నెలకొంది. 21 గ్రామ పంచాయతీలకు ఇదొక్కటే పశువైద్యశాల. చిన్నపాటి వర్షానికే చెరువులా మారుతుంది. ఇక్కడ పనిచేసే సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

సామగ్రి, కంప్యూటర్, లోపల ఉండే ఫ్యాను, ఫ్రిడ్జ్​లు, మందులు అన్నీ కాపాడుకోలేక సిబ్బంది అవస్థలు పడుతున్నారు. ప్లాస్టిక్ కవర్లు చుట్టి... కంప్యూటర్లు తడవకుండా చూస్తున్నారు. ఎలాంటి అధికారిక సమావేశం ఏర్పాటు చేసుకోవాలన్న ఇతర మండలాలపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నూతన భవనం నిర్మిస్తే... వ్యాధి నిర్ధారణ ప్రయోగశాల ఏర్పాటు చేసుకొని... మంచి వైద్యం అందించే వీలుంటుందని సిబ్బంది చెబుతున్నారు. ఒక్క రైల్వేకోడూరు పశువైద్యశాలే కాదు... రాష్ట్రంలో చాలాచోట్ల ఇదే పరిస్థితి. ప్రభుత్వం దృష్టిసారించి సమస్యలు పరిష్కరించాలని పాడిపరిశ్రమ నిర్వాహకులు, రైతులు, సిబ్బంది కోరుతున్నారు.

ఇదీ చూడండి

కనులు లేవని.. కన్నీళ్లకేం తెలుసు !

ప్లాస్టిక్‌ కవర్‌లో మందులు... గొడుగు కింద చికిత్స..!

కడప జిల్లా రైల్వేకోడూరులోని పశు వైద్యశాల ఎంతో ప్రసిద్ధి చెందింది. కానీ ఇప్పుడు అది సమస్యల వలయంలో చిక్కుకుంది. 35ఏళ్ల ముందు నిర్మించిన వైద్యశాల భవనం శిథిలావస్థకు చేరింది. గోడలు ఎప్పుడు పడిపోతాయో తెలియని పరిస్థితి నెలకొంది. 21 గ్రామ పంచాయతీలకు ఇదొక్కటే పశువైద్యశాల. చిన్నపాటి వర్షానికే చెరువులా మారుతుంది. ఇక్కడ పనిచేసే సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

సామగ్రి, కంప్యూటర్, లోపల ఉండే ఫ్యాను, ఫ్రిడ్జ్​లు, మందులు అన్నీ కాపాడుకోలేక సిబ్బంది అవస్థలు పడుతున్నారు. ప్లాస్టిక్ కవర్లు చుట్టి... కంప్యూటర్లు తడవకుండా చూస్తున్నారు. ఎలాంటి అధికారిక సమావేశం ఏర్పాటు చేసుకోవాలన్న ఇతర మండలాలపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నూతన భవనం నిర్మిస్తే... వ్యాధి నిర్ధారణ ప్రయోగశాల ఏర్పాటు చేసుకొని... మంచి వైద్యం అందించే వీలుంటుందని సిబ్బంది చెబుతున్నారు. ఒక్క రైల్వేకోడూరు పశువైద్యశాలే కాదు... రాష్ట్రంలో చాలాచోట్ల ఇదే పరిస్థితి. ప్రభుత్వం దృష్టిసారించి సమస్యలు పరిష్కరించాలని పాడిపరిశ్రమ నిర్వాహకులు, రైతులు, సిబ్బంది కోరుతున్నారు.

ఇదీ చూడండి

కనులు లేవని.. కన్నీళ్లకేం తెలుసు !

Intro:కడప జిల్లా రైల్వేకోడూరు పట్టణంలోని పశు వైద్యశాల దుస్థితిపై ఈటీవీ కథనం.


Body:రైల్వేకోడూరు పట్టణంలోని పశు వైద్యశాల ఎంతో ప్రసిద్ది చెందింది . 35 సంవత్సరాల ముందు నిర్మించిన పశు వైద్యశాల భవనం శిథిలావస్థకు చేరుకుంది. రాజకీయ నాయకులు గాని అధికారులు గాని పశు వైద్యశాల నిర్లక్ష్యం గా చూసి చూడనట్టు వదిలేస్తున్నారు. 1987లో కట్టిన ఈ భవనం చిన్నపాటి వర్షానికి కూడా భవనమంత నీళ్ల తో నిండి కనిపిస్తుంది. గోడలు అన్ని పాచి పట్టి ఉంటాయి. రైల్వేకోడూరు చుట్టుప్రక్కల గ్రామ ప్రజలు వచ్చి వారి పశువులను వైద్యం చేయించుకుని తీసుకుని వెళుతూ ఉంటారు . రైల్వేకోడూరు చుట్టూ ప్రక్కల 21 గ్రామ పంచాయతీ లకు ఇది ఒక్కటే పశు వైద్యశాల. గ్రామాలలో ఎక్కువ కుటుంబాలు పశువుల పై ఆధారపడి జీవిస్తూ ఉంటాయి. ఇక్కడ పశుగ్రాసం ఎక్కువగా ఉండటం వలన పశువులు ఎక్కువగా గ్రామాల్లో పెంచుకుంటూ ఉంటారు. వాటికి ఎటువంటి వైద్య సహాయం కావాలన్నా రైల్వేకోడూరు పట్టణంలోని పశు వైద్యశాల వచ్చి వైద్యం చేయించుకుని వెళ్తుంటారు. అయితే రైల్వేకోడూరు పట్టణంలోని పశువైద్యశాల చాలా ఇబ్బందిగా వైద్యులకు తయారైంది. పశు వైద్యశాల చుట్టుప్రక్కల అపరిశుభ్రంగా ఉండడం, చిన్నపాటి వర్షం వచ్చిన పశు వైద్యశాల అంతా ఉరుస్తూ ఉంటుంది. ఇక్కడ వైద్యులు కూర్చోడానికికూడా వర్షాకాలంలో చాలా ఇబ్బందిగా ఉంటుంది నిలబడే వారు అక్కడికి వచ్చిన జంతువులకు వైద్యం చేయించి పంపుతుంటారు. చిన్నపాటి వర్షానికి కూడా లోపల నీళ్లు అరుస్తూ ఉండడం వలన వైద్యశాల తడిసిపోతుంది. అక్కడ సామగ్రి, కంప్యూటర్ ,లోపల ఉండే ఫ్యాను, ఫ్రిడ్జ్ లు, మందులు అన్నీ కూడా వర్షానికి భవనం నీళ్లు అరుస్తూ ఉండడం వలన తడిచిపోయి ఉంటాయి. వారు సాయంత్రం ఇంటికి పోయే సమయానికి ఆ వస్తువులన్నింటిని ప్లాస్టిక్ కవర్లతో కప్పి వెళుతుంటారు. ఏ చిన్న పాటి వర్షం వచ్చినా లోపలకి నీళ్లు వచ్చి ఇబ్బందులు గురవుతున్నామని అక్కడ పశువైద్యశాల డాక్టర్ తెలిపారు. ఉదయం వచ్చిన వెంటనే గంటలకొద్దీ భవనాన్ని శుభ్రం చేసుకోవడం మాకు పని గా ఉంటుందని అక్కడ పనిచేసే కాంపౌండర్ తెలిపారు. ఇక్కడ అ ఏ చిన్నపాటి సమావేశం ఏర్పాటు చేసుకోవాలన్న ఇతర మండలాల పై ఆధారపడి ఉండాల్సి ఉంటుందని అక్కడ వైద్యులు తెలిపారు. పశు వైద్యశాలకు ప్రహరీ గోడ లేనందువల్ల రాత్రుల్లో మందుబాబులు యాచకులు వస్తే అపరిశుభ్రంగా వైద్యశాలను చేస్తూ ఉంటారని వారు తెలిపారు.వైద్యశాల నూతనంగా నిర్మిస్తే అందులో పశువుల వ్యాధి నిర్ధారణ ప్రయోగశాల ఏర్పాటు చేసుకుని పశువులకు మంచి వైద్యం అందించే వీలు ఉంటుందని వారు తెలిపారు సాధ్యమైనంత త్వరగా ప్రభుత్వం పశు వైద్యశాల నిర్మించి ఇవ్వాలని వారు కోరుతున్నారు.

బైట్స్

1. డాక్టర్ విజయ్ కుమార్ , పశు వైద్యశాల డాక్టర్
2. బాలసుబ్రహ్మణ్యం, కంప్యూటర్ ఆపరేటర్.
3. డాక్టర్ ప్రతాప్, సెట్టిగుంట పశువైద్యశాల డాక్టర్


Conclusion:పశు వైద్యశాల శిధిలావస్థలో ఉన్నందువల్ల పశువులను తీసుకుని వచ్చే ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నామని ఇప్పటికైనా పశు వైద్యశాల నూతనంగా నిర్మించి ఇవ్వాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.