ETV Bharat / state

Kadapa: రూ.3లక్షల విలువైన ఎర్రచందనం పట్టివేత

కడప జిల్లా కాశి నాయన మండలం నల్లమల అడవుల్లో ఎర్రచందనం దుంగలను అక్రమంగా రవాణా చేస్తున్న వ్యక్తిని అటవీ అధికారులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి రూ. 3లక్షల విలువైన 23 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు.

author img

By

Published : Jul 16, 2021, 12:10 PM IST

red sandalwood
ఎర్రచందనం

కడప జిల్లా కాశి నాయన మండలం నల్లమల అడవుల్లో అక్రమంగా తరలిస్తున్న రూ.3 లక్షల విలువైన 23 ఎర్రచందనం దుంగలను, ఓ వాహనాన్ని పోరుమామిళ్ల అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎర్రచందనాన్ని స్మగ్లింగ్​ చేస్తున్న మునీంద్ర అనే వ్యక్తిని అరెస్టు చేశామని ఎఫ్ఆర్ఓ తిరుమలేష్ వెల్లడించారు.

ఎర్రచందనం అక్రమ రవాణాపై సమాచారం రావడంతో కాశినాయన నల్లమల అడవుల్లో అధికారులు తనిఖీలు చేపట్టారు.ఈ క్రమంలో కాశి నాయన మండలం నాయన పల్లి కి చెందిన మునీంద్ర పట్టుబడగా మిగిలిన వారు తప్పించుకొని పారిపోయారు. ఎఫ్ ఆర్ ఓ తిరుమలేష్ వెల్లడించారు. తప్పించుకుని పారిపోయి వారిని త్వరలో పట్టుకుంటామని వివరించారు . నిందితున్ని బద్వేలు న్యాయస్థానం ఎదుట హాజరు పరిచినట్లు తెలిపారు.

కడప జిల్లా కాశి నాయన మండలం నల్లమల అడవుల్లో అక్రమంగా తరలిస్తున్న రూ.3 లక్షల విలువైన 23 ఎర్రచందనం దుంగలను, ఓ వాహనాన్ని పోరుమామిళ్ల అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎర్రచందనాన్ని స్మగ్లింగ్​ చేస్తున్న మునీంద్ర అనే వ్యక్తిని అరెస్టు చేశామని ఎఫ్ఆర్ఓ తిరుమలేష్ వెల్లడించారు.

ఎర్రచందనం అక్రమ రవాణాపై సమాచారం రావడంతో కాశినాయన నల్లమల అడవుల్లో అధికారులు తనిఖీలు చేపట్టారు.ఈ క్రమంలో కాశి నాయన మండలం నాయన పల్లి కి చెందిన మునీంద్ర పట్టుబడగా మిగిలిన వారు తప్పించుకొని పారిపోయారు. ఎఫ్ ఆర్ ఓ తిరుమలేష్ వెల్లడించారు. తప్పించుకుని పారిపోయి వారిని త్వరలో పట్టుకుంటామని వివరించారు . నిందితున్ని బద్వేలు న్యాయస్థానం ఎదుట హాజరు పరిచినట్లు తెలిపారు.

ఇదీ చదవండి: RED SANDLE: 800 కిలోల ఎర్రచందనం దుంగలు స్వాధీనం.. ఐదుగురు అరెస్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.