ETV Bharat / state

'ఆమె మృతదేహాన్ని మా గ్రామంలో ఖననం చేయొద్దు' - పుణెలో మృతిచెందిన నందలూరు గ్రామ మహిళ

కరోనా... ప్రాణాలు తీసే మహమ్మారి. దాన్నుంచి కోలుకున్నవారు అధిక సంఖ్యలో ఉంటున్నా.. కొందరు మరణిస్తున్నారు. అయితే.. వైరస్ సోకి మరణించిన వ్యక్తి మృతదేహాన్ని గ్రామంలోకి తీసుకురావద్దంటున్నారు.. కడప జిల్లా నందలూరు గ్రామస్థులు. తమ గ్రామానికి చెందిన మహిళే అయినా.. కరోనాతో మృతిచెందిన కారణంగా ఊరిలో ఖననం చేయొద్దంటూ ఆందోళన చేస్తున్నారు.

kadapa district nandaluru villagers protest dont burried corona effective woman body in our village
నందలూరు గ్రామస్థులకు నచ్చజెప్తున్న డీఎస్పీ
author img

By

Published : May 18, 2020, 2:53 PM IST

Updated : May 18, 2020, 5:08 PM IST

కరోనా సోకిన మహిళ మృతదేహాన్ని తమ గ్రామంలో ఖననం చేయొద్దంటూ ప్రజలు ఆందోళన చేసిన ఘటన కడప జిల్లా నందలూరులో జరిగింది. మండలంలోని ఆడపూరుకు చెందిన పుష్పలత అనే మహిళ క్యాన్సర్ వ్యాధితో పుణెలో చికిత్స పొందుతూ మృతిచెందింది. ఆమె మృతదేహానికి కొవిడ్ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్​గా తేలింది. అక్కడి ఆసుపత్రి సిబ్బంది ఆమె మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించే ఏర్పాట్లు చేసి.. కడప జిల్లా అధికార యంత్రాంగానికి సమాచారం ఇచ్చారు.

స్పందించిన అధికారులు ఆడపూరు గ్రామానికి చేరుకుని ఆమె ఖననానికి ఏర్పాట్లు చేశారు. విషయం తెలుసుకున్న స్థానికులు అక్కడికి చేరుకుని ఇక్కడ దహనసంస్కారాలు చేయొద్దంటూ ఆందోళన చేశారు. రాజంపేట డీఎస్పీ నారాయణస్వామి వారికి నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. అన్ని జాగ్రత్తలతో ఖననం చేస్తామని.. ఆమెతోపాటు వాహనంలో వచ్చేవారికీ వైద్య పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. అయినప్పటికీ గ్రామస్థులు వినడంలేదు. ఇంకా పుష్పలత మృతదేహం గ్రామానికి చేరుకోలేదు.

కరోనా సోకిన మహిళ మృతదేహాన్ని తమ గ్రామంలో ఖననం చేయొద్దంటూ ప్రజలు ఆందోళన చేసిన ఘటన కడప జిల్లా నందలూరులో జరిగింది. మండలంలోని ఆడపూరుకు చెందిన పుష్పలత అనే మహిళ క్యాన్సర్ వ్యాధితో పుణెలో చికిత్స పొందుతూ మృతిచెందింది. ఆమె మృతదేహానికి కొవిడ్ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్​గా తేలింది. అక్కడి ఆసుపత్రి సిబ్బంది ఆమె మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించే ఏర్పాట్లు చేసి.. కడప జిల్లా అధికార యంత్రాంగానికి సమాచారం ఇచ్చారు.

స్పందించిన అధికారులు ఆడపూరు గ్రామానికి చేరుకుని ఆమె ఖననానికి ఏర్పాట్లు చేశారు. విషయం తెలుసుకున్న స్థానికులు అక్కడికి చేరుకుని ఇక్కడ దహనసంస్కారాలు చేయొద్దంటూ ఆందోళన చేశారు. రాజంపేట డీఎస్పీ నారాయణస్వామి వారికి నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. అన్ని జాగ్రత్తలతో ఖననం చేస్తామని.. ఆమెతోపాటు వాహనంలో వచ్చేవారికీ వైద్య పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. అయినప్పటికీ గ్రామస్థులు వినడంలేదు. ఇంకా పుష్పలత మృతదేహం గ్రామానికి చేరుకోలేదు.

ఇవీ చదవండి:

క్వారంటైన్ కేంద్రం నుంచి 15మంది కరోనా బాధితుల పరార్..!

Last Updated : May 18, 2020, 5:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.