కడప జిల్లా ఎర్రగుంట్ల ఐసీయల్ కాంట్రాక్ట్ కార్మికులు ఆందోళన చేపట్టారు. ఐసీయల్ యాజమాన్యం కాంట్రాక్ట్ కార్మికుల కడుపు కొడుతున్నారని ఆవేదన చెందారు. దాదాపు 3 నెలల నుంచి జీతాలు ఇవ్వలేదని విచారం వ్యక్తం చేశారు. కుటుంబం గడవాలన్నా కష్టంగా మారిందన్నారు. నెలకు కనీసం 26 రోజుల పనిధినాలు కల్పించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి : భయం వద్దు.. ధైర్యంగా ఎదుర్కొందాం..