ప్రాణాలను లెక్కచేయక ప్రజారోగ్య సంరక్షణకు శ్రమిస్తున్న పురపాలిక కార్మికుల సేవలను ఎప్పటికీ మరువలేమని కడప డీఎస్పీ సూర్యనారాయణ అన్నారు. కార్యాలయం ఎదుట హెల్పింగ్ హ్యాండ్స్ సేవా సమితి ఆధ్వర్యంలో శుక్రవారం కార్మికుల పాదాలను పాలతో కడిగి, సన్మానించారు. కరోనా వ్యాప్తి నివారణ కోసం పారిశుద్ద్య కార్మికులు రాత్రింబవళ్లు పని చేస్తున్నారని కొనియాడారు. కార్యక్రమంలో సేవా సమితి నిర్వాహకులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:
బద్వేలులో రైతు బజారు ఏర్పాటుకు స్థల పరిశీలన