కడప జిల్లా దువ్వూరు మండలం కానగూడూరులో మట్టి మిద్దె కూలి ఐదేళ్ల బాలిక ఎర్రబల్లె షమీన మృతి చెందింది. తల్లి ముంతాజ్ గాయపడింది. రెండ్రోజులుగా కురుస్తున్న వర్షాలతో మట్టి మిద్దె నాని కూలింది.
అప్రమత్తమైన స్థానికులు వెంటనే శిథిలాలను తొలగించారు. అప్పటికే బాలిక మృతి చెందింది. గాయపడిన తల్లి ముంతాజ్ను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కుటుంబంలోని మరో ముగ్గురు పొలం పనులకు వెళ్లిన సమయంలో ఈ సంఘటన జరిగింది.