ETV Bharat / state

విషాదం.. మిద్దె కూలి బాలిక మృతి, తల్లికి గాయాలు - కడప జిల్లా తాజా వార్తలు

దువ్వూరు మండలం కానగూడూరులో మట్టి మిద్దె కూలి ఐదేళ్ల బాలిక ఎర్రబల్లె షమీన మృతి చెందింది.

Nalika mruthi
Girl dead
author img

By

Published : Jul 16, 2020, 3:21 PM IST

కడప జిల్లా దువ్వూరు మండలం కానగూడూరులో మట్టి మిద్దె కూలి ఐదేళ్ల బాలిక ఎర్రబల్లె షమీన మృతి చెందింది. తల్లి ముంతాజ్‌ గాయపడింది. రెండ్రోజులుగా కురుస్తున్న వర్షాలతో మట్టి మిద్దె నాని కూలింది.

అప్రమత్తమైన స్థానికులు వెంటనే శిథిలాలను తొలగించారు. అప్పటికే బాలిక మృతి చెందింది. గాయపడిన తల్లి ముంతాజ్‌ను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కుటుంబంలోని మరో ముగ్గురు పొలం పనులకు వెళ్లిన సమయంలో ఈ సంఘటన జరిగింది.

కడప జిల్లా దువ్వూరు మండలం కానగూడూరులో మట్టి మిద్దె కూలి ఐదేళ్ల బాలిక ఎర్రబల్లె షమీన మృతి చెందింది. తల్లి ముంతాజ్‌ గాయపడింది. రెండ్రోజులుగా కురుస్తున్న వర్షాలతో మట్టి మిద్దె నాని కూలింది.

అప్రమత్తమైన స్థానికులు వెంటనే శిథిలాలను తొలగించారు. అప్పటికే బాలిక మృతి చెందింది. గాయపడిన తల్లి ముంతాజ్‌ను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కుటుంబంలోని మరో ముగ్గురు పొలం పనులకు వెళ్లిన సమయంలో ఈ సంఘటన జరిగింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.