ETV Bharat / state

పేదల ఆకలి తీర్చిన ఎమ్మెల్యే - రైల్వేకోడూరు ఎమ్మెల్యే అన్నదానం న్యూస్

లాక్​డౌన్ కారణంగా కడప జిల్లా​ రైల్వేకోడూరు పట్టణంలోని పేద ప్రజలు పనులు లేక ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి పట్టణంలోని పలు ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు.

పేదల ఆకలి తీర్చిన ఎమ్మెల్యే
పేదల ఆకలి తీర్చిన ఎమ్మెల్యే
author img

By

Published : Apr 3, 2020, 10:45 AM IST

రైల్వేకోడూరు పట్టణంలోని పేద ప్రజలు పనులు లేక ఇబ్బందులకు గురవుతున్నారు. చాలామంది తిండి లేక అలమటిస్తున్నారు. ఈ నేపథ్యంలో వైకాపా నాయకులు, స్థానిక ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. పట్టణంలోని ధర్మాపురం, గాంధీనగర్, లక్ష్మీపురం, న్యూ క్రిష్ణ నగర్​కు చెందిన పేద ప్రజలు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు. లాక్​డౌన్​ కారణంగా కోడూరలోని యువత గత కొన్ని రోజులుగా అన్నదాన కార్యక్రమాలు చేపట్టి కొంతమంది నిరుపేదల ఆకలిని తీర్చుతున్నారు.

ఇదీ చూడండి:

రైల్వేకోడూరు పట్టణంలోని పేద ప్రజలు పనులు లేక ఇబ్బందులకు గురవుతున్నారు. చాలామంది తిండి లేక అలమటిస్తున్నారు. ఈ నేపథ్యంలో వైకాపా నాయకులు, స్థానిక ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. పట్టణంలోని ధర్మాపురం, గాంధీనగర్, లక్ష్మీపురం, న్యూ క్రిష్ణ నగర్​కు చెందిన పేద ప్రజలు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు. లాక్​డౌన్​ కారణంగా కోడూరలోని యువత గత కొన్ని రోజులుగా అన్నదాన కార్యక్రమాలు చేపట్టి కొంతమంది నిరుపేదల ఆకలిని తీర్చుతున్నారు.

ఇదీ చూడండి:

ఇన్నాళ్లకు.. రాంబంటు కడుపు నిండింది!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.