ETV Bharat / state

చిరు వ్యాపారులు, అనాథలకు భోజనం పంపిణీ

author img

By

Published : Apr 11, 2020, 6:20 PM IST

కడప జిల్లా కమలాపురంలో చిరు వ్యాపారులు, అనాథలకు పోలీసులు ఆహారం అందజేశారు. పూట గడవక ఇబ్బంది పడుతున్నవారికి ఆపన్నహస్తం అందించారు.

food distributed to little merchants at kamalapuram kadapa district
చిరు వ్యాపారులు, అనాథలకు భోజనం పంపిణీ

కడప జిల్లా కమలాపురం పైడిమాన్ కాలనీలో చిరు వ్యాపారాలు చేసుకునేవారు పూట గడవక శుక్రవారం పోలీసుల్ని ఆశ్రయించారు. లాక్ డౌన్ కారణంగా వ్యాపారులు లేక, ఆదాయం రాక తమకు చాలా ఇబ్బందిగా ఉందని చెప్పారు. స్పందించిన ఎస్సై రాజారెడ్డి.. కూరగాయలు, భోజనం అందిస్తామని చెప్పారు. ఈరోజు ఉదయం స్థానిక వైకాపా నాయకుడు మారుజాళ్ల శ్రీనివాసులు ఆధ్వర్యంలో వారికి భోజనం, నిత్యావసరాలు అందజేశారు. లాక్ డౌన్ కొనసాగినంతకాలం ఆహారం పంపిణీ చేస్తామని పుణ్యభూమి చారిటబుల్ ట్రస్ట్ వారికి హామీ ఇచ్చారు.

కడప జిల్లా కమలాపురం పైడిమాన్ కాలనీలో చిరు వ్యాపారాలు చేసుకునేవారు పూట గడవక శుక్రవారం పోలీసుల్ని ఆశ్రయించారు. లాక్ డౌన్ కారణంగా వ్యాపారులు లేక, ఆదాయం రాక తమకు చాలా ఇబ్బందిగా ఉందని చెప్పారు. స్పందించిన ఎస్సై రాజారెడ్డి.. కూరగాయలు, భోజనం అందిస్తామని చెప్పారు. ఈరోజు ఉదయం స్థానిక వైకాపా నాయకుడు మారుజాళ్ల శ్రీనివాసులు ఆధ్వర్యంలో వారికి భోజనం, నిత్యావసరాలు అందజేశారు. లాక్ డౌన్ కొనసాగినంతకాలం ఆహారం పంపిణీ చేస్తామని పుణ్యభూమి చారిటబుల్ ట్రస్ట్ వారికి హామీ ఇచ్చారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.