ETV Bharat / state

సుబ్బయ్య హత్య కేసు : పోలీసుల అదుపులో ఐదుగురు

author img

By

Published : Dec 31, 2020, 3:47 PM IST

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కడప జిల్లా ప్రొద్దుటూరు తెదేపా నేత నందం సుబ్బయ్య హత్య కేసులో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ అన్బురాజన్ వివరాలు వెల్లడించారు.

five members of police hand over  on nandham subbaiah murder case in prodduturu kadapa district
కడప జిల్లా ఎస్పీ అన్బురాజన్

కడప జిల్లా ప్రొద్దుటూరులో నందం సుబ్బయ్య హత్య కేసుకు సంబంధించి ఐదుగురిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. వీరిని గురువారం సాయంత్రం మీడియా ఎదుట హాజరు పరుస్తామని వెల్లడించారు. ఈ కేసులో నిందితులైన ఏ1, ఏ2లకు, మృతునికి మధ్య మనస్పర్థలు ఉండేవని, వాటికి సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని పేర్కొన్నారు. నిష్పక్షపాతంగా విచారణ చేపట్టి, దోషులను కఠినంగా శిక్షిస్తామని ఎస్పీ స్పష్టం చేశారు.

కడప జిల్లా ప్రొద్దుటూరులో నందం సుబ్బయ్య హత్య కేసుకు సంబంధించి ఐదుగురిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. వీరిని గురువారం సాయంత్రం మీడియా ఎదుట హాజరు పరుస్తామని వెల్లడించారు. ఈ కేసులో నిందితులైన ఏ1, ఏ2లకు, మృతునికి మధ్య మనస్పర్థలు ఉండేవని, వాటికి సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని పేర్కొన్నారు. నిష్పక్షపాతంగా విచారణ చేపట్టి, దోషులను కఠినంగా శిక్షిస్తామని ఎస్పీ స్పష్టం చేశారు.

ఇదీచదవండి.

సుబ్బయ్య హత్య జరిగినప్పుడు నేను హోమంలో ఉన్నా: మున్సిపల్‌ కమిషనర్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.