కడప జిల్లాలో రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. మెున్నటి వరకు కేసులు లేని మండలాల్లో ఇప్పుడు కొవిడ్ విజృంభిస్తోంది. రాజుపాలెంలో ఆదివారం తొలి కరోనా కేసు నమోదైంది. బాధితుడు ఇటీవల మైలవరం మండలం నవాబుపేటలోని అత్తారింటికి వెళ్లిరావటంతో వైరస్ సోకినట్లు అధికారులు తెలిపారు. అతనితో సన్నిహితంగా ఉన్న 50 మందిని గుర్తించారు.
ఇవీ చదవండి