ETV Bharat / state

తోటకు నిప్పు పెట్టిన దుండగలు.. రూ. లక్షా యాభై వేల నష్టం

author img

By

Published : Mar 3, 2021, 7:20 AM IST

Updated : Mar 3, 2021, 11:25 AM IST

కడప జిల్లా వేంపల్లె మండలంలోని కుమ్మరాంపల్లె పంచాయతీ పరిధిలో గుర్తు తెలియని వ్యక్తులు.. తోటకు నిప్పుపెట్టారు. ఈ ఘటనలో మామిడి, నిమ్మ తోటలు కాలిపోయాయి. చెట్లతో పాటు డ్రిప్ పైపులు అగ్నికి ఆహుతి అయ్యాయి. సుమారు లక్షా యాభై వేల రూపాయలు నష్టం వాటిల్లిందని బాధిత రైతు తెలిపారు.

fire accident in kadapa
కుమ్మరాంపల్లెలో అగ్ని ప్రమాదం

తోటకు నిప్పు పెట్టిన దుండగలు

కడప జిల్లా వేంపల్లె మండలంలోని కుమ్మరాంపల్లెలో దుండగులు.. తోటకు నిప్పు పెట్టారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల సమీపంలోని పొలంలో అస్లం మహమ్మద్ గౌస్ అనే రైతు మామిడి, నిమ్మ తోటను సాగు చేస్తున్నాడు. మంగళవారం సాయంత్రం గుర్తు తెలియని వ్యక్తులు పొలానికి నిప్పు పెట్టిన ఘటనలో... మామిడి, నిమ్మ చెట్లతో పాటు డ్రిప్ పైపులు కాలిపోయాయి.

స్థానికులు గౌస్​కు సమాచారం ఇచ్చారు. బాధితుడు తోట వద్దకు వెళ్లి మంటలు ఆర్పే ప్రయత్నం చేశాడు. మంటలు ఎక్కువ కావడంతో పులివెందుల ఫైర్ స్టేషన్​కు సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది పొలం వద్దకు చేరుకొని మంటలను ఆర్పి వేశారు. ఈ ప్రమాదం వల్ల సుమారు లక్షా యాభై వేల రూపాయలు నష్టం జరిగిందని రైతు అస్లం మహమ్మద్ గౌస్ వాపోయాడు.

తోటకు నిప్పు పెట్టిన దుండగలు

కడప జిల్లా వేంపల్లె మండలంలోని కుమ్మరాంపల్లెలో దుండగులు.. తోటకు నిప్పు పెట్టారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల సమీపంలోని పొలంలో అస్లం మహమ్మద్ గౌస్ అనే రైతు మామిడి, నిమ్మ తోటను సాగు చేస్తున్నాడు. మంగళవారం సాయంత్రం గుర్తు తెలియని వ్యక్తులు పొలానికి నిప్పు పెట్టిన ఘటనలో... మామిడి, నిమ్మ చెట్లతో పాటు డ్రిప్ పైపులు కాలిపోయాయి.

స్థానికులు గౌస్​కు సమాచారం ఇచ్చారు. బాధితుడు తోట వద్దకు వెళ్లి మంటలు ఆర్పే ప్రయత్నం చేశాడు. మంటలు ఎక్కువ కావడంతో పులివెందుల ఫైర్ స్టేషన్​కు సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది పొలం వద్దకు చేరుకొని మంటలను ఆర్పి వేశారు. ఈ ప్రమాదం వల్ల సుమారు లక్షా యాభై వేల రూపాయలు నష్టం జరిగిందని రైతు అస్లం మహమ్మద్ గౌస్ వాపోయాడు.

ఇదీ చదవండి:

'నేను ఎవరిని కిడ్నాప్ చేయలేదు... నాకు ఆ అవసరం లేదు'

Last Updated : Mar 3, 2021, 11:25 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.