ETV Bharat / state

మద్యం కంటే కూరగాయల అమ్మకం హీనమా.. ..?

author img

By

Published : May 6, 2020, 9:12 AM IST

నిబంధనల పేరుతో తాము పండింటిన పంటను అమ్ముకోనియకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు కడపజిల్లా బద్వేలు రైతులు. రోడ్డుపై కూరగాయలను పారబోసి నిరసన తెలిపారు.

Farmers Protest throwing vegetables on the road
రైతుల నిరసన

కడప జిల్లా బద్వేలులో రైతులు నిరసన చేపట్టారు. నాలుగు రోడ్ల కూడలిలో కూరగాయలను రోడ్డుపై పారబోసి నిరసన తెలిపారు. లాక్​డోన్ పేరుతో కూరగాయలను అమ్మనీయకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. కరోనా అంటే అందరికీ భయమేనని ఆయితే తాము అహర్నిశలు కష్టపడి పండించిన కూరగాయలను విక్రయించకుండా చేస్తే ఎలా బ్రతకాలని ప్రశ్నించారు. బ్రాందీ షాపుల కంటే తాము అధ్వానంగా కనిపిస్తున్నామా అని పోలీసుల చర్యలపై మండిపడ్డారు. ఇప్పటికైనా పోలీసులు తమ కష్టాలు గమనించి బద్వేలులో కూరగాయల విక్రయాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

కడప జిల్లా బద్వేలులో రైతులు నిరసన చేపట్టారు. నాలుగు రోడ్ల కూడలిలో కూరగాయలను రోడ్డుపై పారబోసి నిరసన తెలిపారు. లాక్​డోన్ పేరుతో కూరగాయలను అమ్మనీయకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. కరోనా అంటే అందరికీ భయమేనని ఆయితే తాము అహర్నిశలు కష్టపడి పండించిన కూరగాయలను విక్రయించకుండా చేస్తే ఎలా బ్రతకాలని ప్రశ్నించారు. బ్రాందీ షాపుల కంటే తాము అధ్వానంగా కనిపిస్తున్నామా అని పోలీసుల చర్యలపై మండిపడ్డారు. ఇప్పటికైనా పోలీసులు తమ కష్టాలు గమనించి బద్వేలులో కూరగాయల విక్రయాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

ఇవీ చూడండి...

ఫోన్​ ఎత్తలేదన్న కోపంతో భార్యపై మందుబాబు దాడి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.