ETV Bharat / state

ఇంటి పెద్దకోసం ఐదేళ్ల ఎదురుచూపులు - family faced problem due to husband missing

కన్నతండ్రిని కళ్ళారా చూడాలన్న కోరిక ఓ బిడ్డది... కట్టుకున్న భర్తను కడసారి చూపైనా దక్కుతుందా అనే సందేహం ఓ భార్యది. బతుకుదెరువు కోసం సరిహద్దులు దాటి వెళ్లిన ఇంటిపెద్ద ఆచూకీ తెలియక విలవిలాడిపోతున్న ఓ కుటుంబ అరణ్యరోదనపై ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం...

ఇంటి పెద్దకోసం ఐదేళ్ల ఎదురుచూపులు
author img

By

Published : Jun 15, 2019, 2:45 PM IST

Updated : Jun 15, 2019, 2:51 PM IST


కరవు పరిస్థితులు నెలకొన్న కడప జిల్లాలో ఉపాధి కోసం సొంత ఊళ్లు వదిలి గల్ఫ్ దేశాల్లో ఇబ్బందులు పడే సంఘటనలు ఎన్నో దర్శనమిస్తున్నాయి. గత కొంత కాలంగా జిల్లా నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్లేవారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. అలా వెళ్లిన వారిలో ఆర్థికంగా చితికిపోయి ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. అలాంటి కష్టమే సయ్యద్ అలీ అనే కుటుంబాని వెంటాడుతోంది. కువైట్ వెళ్లిన సయ్యద్ తిరిగి వస్తాడా.? అసలు చూస్తామా అనే ఆవేదనలో ఉంది అతని కుటుంబం.

కడప జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలం రెడ్డివారి పల్లెకు చెందిన సయ్యద్ అలీ ఐదేళ్ల కిందట గల్ఫ్ దేశమైన కువైట్ వెళ్లారు. ఎడారిలో జీవాలను మేపుతూ... వచ్చిన వేతనాన్ని ఇంటికి పంపి తల్లీ తండ్రి, భార్య పిల్లలను పోషించుకుంటూ వచ్చారు. ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో కానీ 2016 జూన్ 10 తర్వాత సయ్యద్ అలీ నుంచి ఇంటికి ఫోన్ రాలేదు. ఆయన ఎక్కడున్నాడు..ఎలా ఉన్నాడు తెలియడం లేదు. నాటి నుంచి ఆ పేద కుటంబం తల్లిడిల్లిపోతోంది.

గల్ఫ్​కు వెళ్లిన కొడుకుపై బెంగ పెట్టుకున్న తల్లి ఇటీవలి మృతి చెందింది. ఇక సయ్యద్ అలీ భార్య షేక్ రహమత్ ఉన్నిసా భర్త కోసం ఎదురుచూస్తూ నిత్యం రోధిస్తోంది. కుటుంబ పోషణ భారం ఆమె పైనే పడింది. కూలీకెళ్తేగానే పూటగడవని పరిస్థితి. ఓ వైపు ఇంటి పెద్దగా బతుకుబండి లాగుతూనే... బరువెక్కిన హృదయంతో భర్త కోసం ఎదురుచూస్తోందామె.

అలీ ఇంటిని తెలంగాణకు చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ సందర్శించిది. ఎలాగైనా కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి సమస్యను తీసుకెళ్లి సయ్యద్ అలీని కుటుంబ సభ్యుల దరి చేరుస్తామని భరోసా ఇచ్చింది.

ఇంటి పెద్దకోసం ఐదేళ్ల ఎదురుచూపులు


కరవు పరిస్థితులు నెలకొన్న కడప జిల్లాలో ఉపాధి కోసం సొంత ఊళ్లు వదిలి గల్ఫ్ దేశాల్లో ఇబ్బందులు పడే సంఘటనలు ఎన్నో దర్శనమిస్తున్నాయి. గత కొంత కాలంగా జిల్లా నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్లేవారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. అలా వెళ్లిన వారిలో ఆర్థికంగా చితికిపోయి ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. అలాంటి కష్టమే సయ్యద్ అలీ అనే కుటుంబాని వెంటాడుతోంది. కువైట్ వెళ్లిన సయ్యద్ తిరిగి వస్తాడా.? అసలు చూస్తామా అనే ఆవేదనలో ఉంది అతని కుటుంబం.

కడప జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలం రెడ్డివారి పల్లెకు చెందిన సయ్యద్ అలీ ఐదేళ్ల కిందట గల్ఫ్ దేశమైన కువైట్ వెళ్లారు. ఎడారిలో జీవాలను మేపుతూ... వచ్చిన వేతనాన్ని ఇంటికి పంపి తల్లీ తండ్రి, భార్య పిల్లలను పోషించుకుంటూ వచ్చారు. ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో కానీ 2016 జూన్ 10 తర్వాత సయ్యద్ అలీ నుంచి ఇంటికి ఫోన్ రాలేదు. ఆయన ఎక్కడున్నాడు..ఎలా ఉన్నాడు తెలియడం లేదు. నాటి నుంచి ఆ పేద కుటంబం తల్లిడిల్లిపోతోంది.

గల్ఫ్​కు వెళ్లిన కొడుకుపై బెంగ పెట్టుకున్న తల్లి ఇటీవలి మృతి చెందింది. ఇక సయ్యద్ అలీ భార్య షేక్ రహమత్ ఉన్నిసా భర్త కోసం ఎదురుచూస్తూ నిత్యం రోధిస్తోంది. కుటుంబ పోషణ భారం ఆమె పైనే పడింది. కూలీకెళ్తేగానే పూటగడవని పరిస్థితి. ఓ వైపు ఇంటి పెద్దగా బతుకుబండి లాగుతూనే... బరువెక్కిన హృదయంతో భర్త కోసం ఎదురుచూస్తోందామె.

అలీ ఇంటిని తెలంగాణకు చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ సందర్శించిది. ఎలాగైనా కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి సమస్యను తీసుకెళ్లి సయ్యద్ అలీని కుటుంబ సభ్యుల దరి చేరుస్తామని భరోసా ఇచ్చింది.

ఇంటి పెద్దకోసం ఐదేళ్ల ఎదురుచూపులు
Intro:Ap_vsp_46_14_maji_mantri_dadi_press_meet_ab_c4
శాసనసభ్యులు పార్టీ ఫిరాయింపులపై మాట్లాడే హక్కు చంద్రబాబునాయుడు లేదని మాజీమంత్రి వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు తెలిపారు విశాఖ జిల్లా అనకాపల్లి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు సీఎం జగన్మోహన్ రెడ్డి విధానం దేశానికి ఆదర్శం అని పేర్కొన్నారు ఒక పార్టీ గుర్తుపై గెలుపొంది మరొక పార్టీలోకి పిరాయించే ప్రజా ప్రతినిధుల పదవులు రద్దు చేయాలన్న జగన్ నిర్ణయాన్ని దేశవ్యాప్తంగా అన్ని చట్టసభల్లోనూ అమలు చేయాలని సూచించారు


Body:చంద్రబాబు నాయుడు విధానాలు లేని నాయకుడని రోజుకో మాట పూటకో విధానం ఆయన దని ఎద్దేవా చేశారు ఆయన సీఎం అయ్యాక 23 మంది వైకాపా ఎమ్మెల్యేలు ముగ్గురు ఎంపీలను తెదేపాలోకి చేర్చుకొని వీరిలో నలుగురికి మంత్రి పదవులు ఇచ్చారన్నారు పార్టీ ఫిరాయింపులు జగన్ వ్యతిరేకించడం వల్ల నేడు 23 మంది ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడు మిగిలారని చంద్రబాబు లాగా జగన్ ప్రోత్సహిస్తే తెదేపాలో ఒక్క ఎమ్మెల్యే మిగలరన్నారు. ఎన్టీఆర్ భవన్లో జగన్ ఫోటో పెట్టుకుని చంద్రబాబు తన పార్టీ నడపాలని సూచించారు ఘోర ఓటమి చవిచూసిన చంద్రబాబు నాయుడు నీతులు చెప్పకుండా ప్రతిపక్ష నాయకుడిగా హుందాగా మాట్లాడాలని దాడి సూచించారు.


Conclusion:బైట్1 దాడి వీరభద్రరావు మాజీ మంత్రి
Last Updated : Jun 15, 2019, 2:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.