ETV Bharat / state

పులివెందులలో వెయ్యి రూపాయల పంపిణీ - kadapa mp

కడప జిల్లాలో వెయ్యి రూపాయల పంపిణీ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. కడప జిల్లా పులివెందులలో కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

Commencement of one thousand rupee distribution program in Pulivendula
పులివెందులలో వెయ్యి రూపాయల పంపిణీ
author img

By

Published : Apr 4, 2020, 3:14 PM IST

కడప జిల్లా పులివెందులలో రేషన్ కార్డు కలిగిన కుటుంబానికి వెయ్యి రూపాయలు పంపిణీ కార్యక్రమాన్ని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ప్రారంభించారు. స్థానిక భాస్కర పురం వీధిలో వార్డు వాలంటీర్లతో కలిసి ప్రతి ఇంటికి నగదును అందజేశారు. లాక్​డౌన్ కారణంగా పేద ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం వెయ్యి రూపాయలు ఇవ్వాలని నిర్ణయించిందని తెలిపారు. కరోనా నివారణకు చర్యలు చేపట్టడమే కాకుండా ప్రతి కుటుంబానికి రేషన్​తో పాటు నగదు పంపిణీ చెయ్యడం సంతోషంగా ఉందని లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు.

కడప జిల్లా పులివెందులలో రేషన్ కార్డు కలిగిన కుటుంబానికి వెయ్యి రూపాయలు పంపిణీ కార్యక్రమాన్ని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ప్రారంభించారు. స్థానిక భాస్కర పురం వీధిలో వార్డు వాలంటీర్లతో కలిసి ప్రతి ఇంటికి నగదును అందజేశారు. లాక్​డౌన్ కారణంగా పేద ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం వెయ్యి రూపాయలు ఇవ్వాలని నిర్ణయించిందని తెలిపారు. కరోనా నివారణకు చర్యలు చేపట్టడమే కాకుండా ప్రతి కుటుంబానికి రేషన్​తో పాటు నగదు పంపిణీ చెయ్యడం సంతోషంగా ఉందని లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి.

కరోనా నివారణకు పంచాయతీరాజ్ శాఖ చర్యలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.