కడప జిల్లా పులివెందులలో రేషన్ కార్డు కలిగిన కుటుంబానికి వెయ్యి రూపాయలు పంపిణీ కార్యక్రమాన్ని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ప్రారంభించారు. స్థానిక భాస్కర పురం వీధిలో వార్డు వాలంటీర్లతో కలిసి ప్రతి ఇంటికి నగదును అందజేశారు. లాక్డౌన్ కారణంగా పేద ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం వెయ్యి రూపాయలు ఇవ్వాలని నిర్ణయించిందని తెలిపారు. కరోనా నివారణకు చర్యలు చేపట్టడమే కాకుండా ప్రతి కుటుంబానికి రేషన్తో పాటు నగదు పంపిణీ చెయ్యడం సంతోషంగా ఉందని లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి.