కడప జిల్లా రాజంపేటలో కరోనా వైరస్ నియంత్రణ కోసం తన వంతు సాయంగా కాకతీయ విద్యాసంస్థల అధినేత పోలా శ్రీనివాసరెడ్డి 50 వేల రూపాయలను పురపాలక కమిషనర్ రాజశేఖర్కు అందించారు. ఆ నగదుతో పట్టణంలో ప్రధాన రహదారుల్లో రసాయన ద్రావణాలను పిచికారీ చేశారు. ఈ కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, సీఎం జగన్ ఇచ్చిన పిలుపు మేరకు కాకతీయ విద్యాసంస్థల అధినేత నగదు విరాళం ఇవ్వటం సంతోషంగా ఉందన్నారు. త్వరలోనే కరోనా వైరస్ నియంత్రణ కోసం పాటుపడుతున్న పోలీసులు, వైద్య, పారిశుద్ధ్య సిబ్బందికి నిరంతర భోజన వసతి కల్పిస్తామని దాత శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పురపాలక కమిషనర్ రాజశేఖర్ పాల్గొన్నారు.
ఇదీ చదవండి: కరోనా పాజిటివ్ కేసులు: ఏయే జిల్లాలో ఎంతమంది..?