దిల్లీలో ఇద్దరు తెలుగు వైద్యుల అదృశ్యం కలకలం రేపుతోంది. కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన హిమబిందు, అనంతపురం జిల్లా హిందూపురం పట్టణానికి చెందిన దిలీప్ సత్య ఈ నెల 25 నుంచి కనిపించకుండా పోయారు. దిలీప్ సత్య ఛండీగఢ్లో పనిచేస్తుండగా... హిమబిందు దిల్లీలోనే ఓ ప్రభుత్వ ఆస్పత్రిలో విధులు నిర్వర్తిస్తున్నారు.
హిమబిందు భర్తకు దిలీప్ సత్య మిత్రుడు. ఈనెల 25న వీరువురు చర్చికి వెళ్తున్నట్లు చెప్పారని... ఆ తర్వాత అదృశ్యమైనట్లు హిమబిందు భర్త తెలిపారు. ఐదురోజులుగా పోలీసులు వారి ఆచూకీ తెలుసుకోలేకపోయారని వివరించారు. వారికి ఏమైనా అపాయం జరిగి ఉండొచ్చని కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి : ప్రకాశం జిల్లాలో దారుణం... పొలంలోకి నీళ్లొచ్చాయని హత్య!