మాజీమంత్రి ఆదినారాయణరెడ్డికి ఓ వ్యక్తి ఫోన్లో బెదిరించినట్లు సమాచారం. బెదిరించడంతో పాటు భారీ స్థాయిలో నగదును డిమాండ్ చేసినట్లు తెలిసింది . ఈనెల 13వ తేదీ రాత్రి, 14వ తేదీ ఉదయం గుంటూరు జిల్లా సత్తెనపల్లికి చెందిన ఎరువ బాలకృష్ణ మాజీమంత్రికి ఫోన్ చేసి.... 75 లక్షల రూపాయలు నగదు కావాలని డిమాండ్ చేసినట్లు తెలిసింది. ఆదినారాయణ రెడ్డి అనుచరుడు కిరణ్ ఫిర్యాదు మేరకు జమ్మలమడుగు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
ఇదీచదవండి