ETV Bharat / state

ప్రయాణికులకు గుడ్ న్యూస్ - దసరా, దీపావళి పండుగలకు 1400 ప్రత్యేక రైళ్లు

నవంబర్​ 30 వరకు ప్రత్యేక రైళ్లు - రాబోయే రోజుల్లో మరికొన్ని - ప్రయాణికుల కోసం నవరాత్రి స్పెషల్​ థాలి

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : 2 hours ago

Special_Trains_for_Dussehra
Special Trains for Dussehra (ETV Bharat)

Special Trains for Dussehra and Diwali: దసరా, దీపావళి పండుగల దృష్ట్యా ప్రయాణికుల సౌకర్యార్థం సుమారు 1400 ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. అక్టోబర్, నవంబర్ నెలలలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ప్రయాణానికి డిమాండ్ ఎక్కువగా ఉండటం, ఉత్తర భారత రాష్ట్రాలైన బిహార్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ వంటి తూర్పు రాష్ట్రాలకు కూడా ప్రయాణించడానికి అధిక డిమాండ్ ఉన్న దృష్ట్యా ఎక్కువ రైళ్లు నడుపుతున్నట్లు అధికారులు తెలిపారు.

ప్రస్తుతం ఈ రైళ్లు అక్టోబరు 1 నుంచి నవంబర్ 30 వరకు వేర్వేరు తేదీల్లో నడపుతున్నట్లు తెలిపారు. ప్రజల పెరుగుతున్న డిమాండ్​ను తీర్చడానికి రాబోయే రోజుల్లో మరిన్ని ప్రత్యేక రైళ్లను ప్రకటించాలని దక్షిణ మధ్య రైల్వే యోచిస్తున్నట్లు తెలిపారు. ప్రయాణికుల సౌకర్యార్థం అదనపు బుకింగ్ కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రిజర్వ్ చేయని కోచ్​ల ద్వారా ప్రయాణించాలనుకునే వారి కోసం జనరల్ కౌంటర్ల వద్ద క్యూలో నిలబడకుండా తమ టిక్కెట్లను మొబైల్ యాప్​లో యూటీఎస్ ద్వారా కొనుగోలు చేసుకొనే అవకాశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

గోవా పర్యటకులకు గుడ్​న్యూస్​ - 9 నుంచి సికింద్రాబాద్-వాస్కోడిగామా బై వీక్లీ ట్రైన్‌

నవరాత్రి స్పెషల్ థాలి: దక్షిణ మధ్య రైల్వే అధికార పరిధిలోని హైదరాబాద్, సికింద్రాబాద్, తిరుపతి స్టేషన్లతో సహా మొత్తం రైల్వే వ్యవస్థలో 150కి పైగా రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల కోసం “నవరాత్రి స్పెషల్ థాలి” పేరుతో ప్రత్యేక భోజన సదుపాయం అందుబాటులోకి తెచ్చినట్లు వెల్లడించారు. ప్రయాణికులు ఈ రుచికరమైన థాలిని ఐఆర్​సీటీసీ (Indian Railway Catering and Tourism Corporation) మొబైల్ యాప్, రైల్వే అధికారిక వెబ్​సైట్ ద్వారా ఆన్​లైన్లో ఆర్డర్ చేసుకొనవచ్చని తెలిపారు.

ప్రధాన స్టేషన్లలో రద్దీ : పండుగ సెలవులతో తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన స్టేషన్లలో భారీగా రద్దీ పెరిగింది. సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లితో పాటు ఇతర స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. వెయిటింగ్ లిస్ట్ వందల సంఖ్యలో దర్శనమిస్తోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వైపునకు వెళ్లే రైళ్లలో నిలబడి వెళ్లేందుకు సైతం ఇబ్బందులు పడుతున్నామని ప్రయాణికులు వాపోతున్నారు. జనరల్ బోగీల్లోకి కనీసం వెళ్లే పరిస్థితి ఉండటం లేదంటూ ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రయాణికుల డిమాండ్ల దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే భారీగా ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది.

పండగల వేళ 6000 ప్రత్యేక రైళ్లు - రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడి

Special Trains for Dussehra and Diwali: దసరా, దీపావళి పండుగల దృష్ట్యా ప్రయాణికుల సౌకర్యార్థం సుమారు 1400 ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. అక్టోబర్, నవంబర్ నెలలలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ప్రయాణానికి డిమాండ్ ఎక్కువగా ఉండటం, ఉత్తర భారత రాష్ట్రాలైన బిహార్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ వంటి తూర్పు రాష్ట్రాలకు కూడా ప్రయాణించడానికి అధిక డిమాండ్ ఉన్న దృష్ట్యా ఎక్కువ రైళ్లు నడుపుతున్నట్లు అధికారులు తెలిపారు.

ప్రస్తుతం ఈ రైళ్లు అక్టోబరు 1 నుంచి నవంబర్ 30 వరకు వేర్వేరు తేదీల్లో నడపుతున్నట్లు తెలిపారు. ప్రజల పెరుగుతున్న డిమాండ్​ను తీర్చడానికి రాబోయే రోజుల్లో మరిన్ని ప్రత్యేక రైళ్లను ప్రకటించాలని దక్షిణ మధ్య రైల్వే యోచిస్తున్నట్లు తెలిపారు. ప్రయాణికుల సౌకర్యార్థం అదనపు బుకింగ్ కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రిజర్వ్ చేయని కోచ్​ల ద్వారా ప్రయాణించాలనుకునే వారి కోసం జనరల్ కౌంటర్ల వద్ద క్యూలో నిలబడకుండా తమ టిక్కెట్లను మొబైల్ యాప్​లో యూటీఎస్ ద్వారా కొనుగోలు చేసుకొనే అవకాశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

గోవా పర్యటకులకు గుడ్​న్యూస్​ - 9 నుంచి సికింద్రాబాద్-వాస్కోడిగామా బై వీక్లీ ట్రైన్‌

నవరాత్రి స్పెషల్ థాలి: దక్షిణ మధ్య రైల్వే అధికార పరిధిలోని హైదరాబాద్, సికింద్రాబాద్, తిరుపతి స్టేషన్లతో సహా మొత్తం రైల్వే వ్యవస్థలో 150కి పైగా రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల కోసం “నవరాత్రి స్పెషల్ థాలి” పేరుతో ప్రత్యేక భోజన సదుపాయం అందుబాటులోకి తెచ్చినట్లు వెల్లడించారు. ప్రయాణికులు ఈ రుచికరమైన థాలిని ఐఆర్​సీటీసీ (Indian Railway Catering and Tourism Corporation) మొబైల్ యాప్, రైల్వే అధికారిక వెబ్​సైట్ ద్వారా ఆన్​లైన్లో ఆర్డర్ చేసుకొనవచ్చని తెలిపారు.

ప్రధాన స్టేషన్లలో రద్దీ : పండుగ సెలవులతో తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన స్టేషన్లలో భారీగా రద్దీ పెరిగింది. సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లితో పాటు ఇతర స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. వెయిటింగ్ లిస్ట్ వందల సంఖ్యలో దర్శనమిస్తోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వైపునకు వెళ్లే రైళ్లలో నిలబడి వెళ్లేందుకు సైతం ఇబ్బందులు పడుతున్నామని ప్రయాణికులు వాపోతున్నారు. జనరల్ బోగీల్లోకి కనీసం వెళ్లే పరిస్థితి ఉండటం లేదంటూ ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రయాణికుల డిమాండ్ల దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే భారీగా ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది.

పండగల వేళ 6000 ప్రత్యేక రైళ్లు - రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.