కడప జిల్లా రాజుపాళెం మండలం గోపాయపల్లె చెక్పోస్టు వద్ద పోలీసులు నగదును పట్టుకున్నారు. ఎలాంటి రశీదులు లేకపోవడం వల్ల 20 లక్షల 20 వేల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. ఉలవపల్లెకు చెందిన ఓ వ్యక్తి ద్విచక్రవాహనంపై నగదును ఆళ్లగడ్డకు తీసుకెళ్తుండగా గుర్తించారు. ఈ డబ్బును ఆదాయపన్ను అధికారులకు అప్పగించారు.
ఇదీ చదవండి : సినిమా థియేటర్లు మూసివేత... పాఠశాలలకు సెలవులు