ETV Bharat / state

VANDEMATHARAM : సంగీత ప్రతిభాపాటవాలతో దేశభక్తిని చాటుకున్న సంగీత మాస్టారు - vandematharam with classical music

సుస్వరమైన సరిగమపదనిసలతో వందేమాతర గీతాన్ని వినసొంపుగా రూపొందించారు ఆ సంగీతం మాస్టారు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 30సంగీత వాయిద్యాలను అవలోకగా పలికించి, జాతీయ గేయానికి మరింత వన్నెలద్దారు. మ్యూజిక్ ఆల్బమ్‌ల రూపకల్పనలో సిద్ధహస్తుడైన ఆయన.. అద్భుతమైన సంగీత ప్రతిభతో దేశభక్తిని చాటుకున్నారు.

సంగీత ప్రతిభాపాటవాలతో దేశభక్తి
సంగీత ప్రతిభాపాటవాలతో దేశభక్తి
author img

By

Published : Aug 23, 2021, 3:57 AM IST

ఓ వైపు తంబోరిన్... మరో వైపు వీణ... ఇంకోవైపు హోర్మోనియం... ఇలా వివిధ సంగీత వాయిదాల్యతో స్వరాలు పలికిస్తున్న ఈయన పేరు ఎస్​పీఎస్.వాసు. సాధారణంగా ఎంతటి సంగీత విధ్వాంసులకైనా ఒకటి లేదా రెండు వాయిద్యాలపై ప్రావీణ్యం ఉంటుంది. ఈ సంగీత మాస్టారుకు ఏకంగా 30 సంగీత వాయిద్యాలపై పట్టు ఉంది. ఆ ప్రతిభతోనే 30 సంగీత వాయిద్య పరికరాలు ఉపయోగించి వందేమాతర గీతాన్ని రూపొందించారు. ఈ ఆల్బమ్ తయారీకి దాదాపు నెల రోజులపాటు సాధన చేశారు. గతంలో 24 సంగీత పరికరాలు వినియోగించి.. జనగణమణను ఆలపించి మన్ననలు పొందారు. తాజాగా సొబగులు అద్దిన వందేమాతర గీతానికీ విశేష ఆదరణ లభిస్తోంది.

సంగీత విధ్వాంసుల కుటుంబంలో పుట్టిన వాసు.. చిన్ననాటి నుంచే సంగీతం నేర్చుకొన్నారు. ఇంటర్‌తోనే చదువు ఆపేసి, నిరంతరం కొత్త ఆలోచనలతో సంగీత సాధన చేస్తున్నారు. 22ఏళ్ల వయసులోనే రెండు వందలకు పైగా మ్యూజిక్, ప్రైవేటు ఆల్బమ్‌లు రూపొందించారు. ఫ్లూట్, సితార వాయించడంలో ఉన్న ప్రావీణ్యం.. పలువురు సంగీత దర్శకుల వద్ద పనిచేసే అవకాశం కల్పించింది. సంగీతంలోనే కాదు, మధురమైన గాత్రంతోనూ మెప్పించారు. స్వరానికి స్వీయ సంగీతం అందించి.. 'నియినివేశం' అనే ఆల్బమ్ రూపొందించారు. అనేక సంగీత ఉత్సవాల్లో పాల్గొని ప్రశంసలు అందుకుంటున్నారు.

వాసుకు ఫ్లూట్, సితారపై మాత్రమే ప్రావీణ్యత ఉండేది. ఆల్బమ్‌ల కోసం వివిధ సంగీత పరికరాలు వాయించడం నేర్చుకున్నారు. ఇంటి వద్దే ప్రత్యేక రికార్డింగ్ గదులు ఏర్పాటు చేశారు. ఖరీదైన దేశవిదేశాల వాయిద్య పరికరాలు కొనుగోలు చేశారు. జ్ఞానాన్ని పది మందికి పంచాలన్న ఆలోచనతో సంగీత పాఠశాలను స్థాపించారు. వివిధ వాయిద్య పరికరాలపైనా విద్యార్థులకు శిక్షణిస్తున్నారు. స్వర కల్పనలో ప్రపంచ రికార్డు సాధించడమే లక్ష్యంగా వాసు చెబుతున్నారు.

ఇదీచదవండి.

ap corona cases: కొత్తగా 1,085 కరోనా కేసులు, 8 మరణాలు

ఓ వైపు తంబోరిన్... మరో వైపు వీణ... ఇంకోవైపు హోర్మోనియం... ఇలా వివిధ సంగీత వాయిదాల్యతో స్వరాలు పలికిస్తున్న ఈయన పేరు ఎస్​పీఎస్.వాసు. సాధారణంగా ఎంతటి సంగీత విధ్వాంసులకైనా ఒకటి లేదా రెండు వాయిద్యాలపై ప్రావీణ్యం ఉంటుంది. ఈ సంగీత మాస్టారుకు ఏకంగా 30 సంగీత వాయిద్యాలపై పట్టు ఉంది. ఆ ప్రతిభతోనే 30 సంగీత వాయిద్య పరికరాలు ఉపయోగించి వందేమాతర గీతాన్ని రూపొందించారు. ఈ ఆల్బమ్ తయారీకి దాదాపు నెల రోజులపాటు సాధన చేశారు. గతంలో 24 సంగీత పరికరాలు వినియోగించి.. జనగణమణను ఆలపించి మన్ననలు పొందారు. తాజాగా సొబగులు అద్దిన వందేమాతర గీతానికీ విశేష ఆదరణ లభిస్తోంది.

సంగీత విధ్వాంసుల కుటుంబంలో పుట్టిన వాసు.. చిన్ననాటి నుంచే సంగీతం నేర్చుకొన్నారు. ఇంటర్‌తోనే చదువు ఆపేసి, నిరంతరం కొత్త ఆలోచనలతో సంగీత సాధన చేస్తున్నారు. 22ఏళ్ల వయసులోనే రెండు వందలకు పైగా మ్యూజిక్, ప్రైవేటు ఆల్బమ్‌లు రూపొందించారు. ఫ్లూట్, సితార వాయించడంలో ఉన్న ప్రావీణ్యం.. పలువురు సంగీత దర్శకుల వద్ద పనిచేసే అవకాశం కల్పించింది. సంగీతంలోనే కాదు, మధురమైన గాత్రంతోనూ మెప్పించారు. స్వరానికి స్వీయ సంగీతం అందించి.. 'నియినివేశం' అనే ఆల్బమ్ రూపొందించారు. అనేక సంగీత ఉత్సవాల్లో పాల్గొని ప్రశంసలు అందుకుంటున్నారు.

వాసుకు ఫ్లూట్, సితారపై మాత్రమే ప్రావీణ్యత ఉండేది. ఆల్బమ్‌ల కోసం వివిధ సంగీత పరికరాలు వాయించడం నేర్చుకున్నారు. ఇంటి వద్దే ప్రత్యేక రికార్డింగ్ గదులు ఏర్పాటు చేశారు. ఖరీదైన దేశవిదేశాల వాయిద్య పరికరాలు కొనుగోలు చేశారు. జ్ఞానాన్ని పది మందికి పంచాలన్న ఆలోచనతో సంగీత పాఠశాలను స్థాపించారు. వివిధ వాయిద్య పరికరాలపైనా విద్యార్థులకు శిక్షణిస్తున్నారు. స్వర కల్పనలో ప్రపంచ రికార్డు సాధించడమే లక్ష్యంగా వాసు చెబుతున్నారు.

ఇదీచదవండి.

ap corona cases: కొత్తగా 1,085 కరోనా కేసులు, 8 మరణాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.