ETV Bharat / state

విషపు ఇంజెక్షన్లతో 300 కుక్కలు హతం.. జంతు ప్రేమికుల ఆగ్రహం

author img

By

Published : Aug 1, 2021, 8:18 PM IST

పశ్చిమ గోదావరి జిల్లాలో విషాద సంఘటన చోటు చేసుకుంది. మూగ జీవాలైనా వీధి కుక్కలను అత్యంత పాశవికంగా, ఎటువంటి కనికరం చూపించకుండా విషపు ఇంజెక్షన్లతో చంపి వేసిన ఘటన... పలువురు జంతు ప్రేమికులను కంటతడి పెట్టించింది. ఒకటి కాదు రెండు కాదు సుమారు 300కు పైగా మూగజీవాలను పొట్టన పెట్టుకున్న వారిని కఠినంగా శిక్షించి, మరల ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని జంతు ప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు.

జంతు ప్రేమికుల ఆగ్రహం
జంతు ప్రేమికుల ఆగ్రహం

విషపు ఇంజెక్షన్లతో 300 కుక్కలను హతమార్చిన దుండగులు

పశ్చిమ గోదావరి జిల్లా లింగపాలెంలో పంచాయతీలో సుమారు 300 కుక్కలకు విషం పెట్టి చంపిన ఘటన పెను సంచలనంగా మారింది. కక్కల మరణానికి కారణమైన వారిపై జంతుప్రేమికులు మండిపడుతున్నారు. అంతేకాక చనిపోయిన కుక్కల కళేబరాలను చెరువులో పెద్ద గొయ్యి తీసి పూడ్చకుండా వదిలేశారు. విశ్వాసానికి మారుపేరుగా పిలుచుకునే కుక్కలు పలు సంఘటనలలో సైతం మానవులకు తోడుగా ఉంటాయని నమ్మకం ఉంటుంది. గుర్తుతెలియని ఆ వ్యక్తుల కర్కశత్వంపై యావత్ జంతు ప్రేమికులు తీవ్ర ఆవేదనకు లోనవుతున్నారు.

ఈ ఘాతుకానికి పంచాయతీ అధికారులే పాల్పడ్డారని ఆరోపిస్తూ.. ధర్మాజీగూడెం పోలీస్ స్టేషన్​లో ఫైట్ ఫర్ యానిమల్ ఆర్గనైజేషన్ సంస్థ ప్రతినిధి చల్లపల్లి శ్రీలత ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మూగజీవాలలైన కుక్కలను చంపే హక్కు ఎవరిచ్చారని, దీనిపై సమగ్ర విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని ఫైట్ ఫర్ యానిమల్ ఆర్గనైజేషన్ సంస్థ ప్రతినిధి శ్రీలత డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ విచారణ జరిపించాలని అధికారులను ఆదేశించారు. ఆదివారం ఉదయం ఆర్డీవో రచన సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. సమగ్ర విచారణ జరిపిన ఆర్డీవో జిల్లా కలెక్టర్​కు నివేదికను అందించునట్లు తెలిపారు.

ఎవరూ చంపారో తెలీదు: పంచాయతీ కార్యదర్శి

పంచాయతీ పరిధిలో తరచూ కుక్కలు దాడులకు తెగబడుతున్నాయని, అంతేకాక ఎక్కడ పడితే అక్కడ గుంపులుగా పోగై రహదారులపై రాకపోకలకు అంతరాయం కలిగిస్తున్నాయని పంచాయతీ కార్యదర్శి తెలిపారు. అయితే వాటిని ఎవరు చంపారో తమకు తెలియదని ధర్మాజీగూడెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.

ఇదీ చదవండి:

Roads Damage: అడుగుకో గుంత.. చినుకుపాటుకు బురదమయం.. ఎలా ప్రయాణం?

బస్సు అంటే ప్రాణం.. అందుకే ఇంటినే ఇలా...

విషపు ఇంజెక్షన్లతో 300 కుక్కలను హతమార్చిన దుండగులు

పశ్చిమ గోదావరి జిల్లా లింగపాలెంలో పంచాయతీలో సుమారు 300 కుక్కలకు విషం పెట్టి చంపిన ఘటన పెను సంచలనంగా మారింది. కక్కల మరణానికి కారణమైన వారిపై జంతుప్రేమికులు మండిపడుతున్నారు. అంతేకాక చనిపోయిన కుక్కల కళేబరాలను చెరువులో పెద్ద గొయ్యి తీసి పూడ్చకుండా వదిలేశారు. విశ్వాసానికి మారుపేరుగా పిలుచుకునే కుక్కలు పలు సంఘటనలలో సైతం మానవులకు తోడుగా ఉంటాయని నమ్మకం ఉంటుంది. గుర్తుతెలియని ఆ వ్యక్తుల కర్కశత్వంపై యావత్ జంతు ప్రేమికులు తీవ్ర ఆవేదనకు లోనవుతున్నారు.

ఈ ఘాతుకానికి పంచాయతీ అధికారులే పాల్పడ్డారని ఆరోపిస్తూ.. ధర్మాజీగూడెం పోలీస్ స్టేషన్​లో ఫైట్ ఫర్ యానిమల్ ఆర్గనైజేషన్ సంస్థ ప్రతినిధి చల్లపల్లి శ్రీలత ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మూగజీవాలలైన కుక్కలను చంపే హక్కు ఎవరిచ్చారని, దీనిపై సమగ్ర విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని ఫైట్ ఫర్ యానిమల్ ఆర్గనైజేషన్ సంస్థ ప్రతినిధి శ్రీలత డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ విచారణ జరిపించాలని అధికారులను ఆదేశించారు. ఆదివారం ఉదయం ఆర్డీవో రచన సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. సమగ్ర విచారణ జరిపిన ఆర్డీవో జిల్లా కలెక్టర్​కు నివేదికను అందించునట్లు తెలిపారు.

ఎవరూ చంపారో తెలీదు: పంచాయతీ కార్యదర్శి

పంచాయతీ పరిధిలో తరచూ కుక్కలు దాడులకు తెగబడుతున్నాయని, అంతేకాక ఎక్కడ పడితే అక్కడ గుంపులుగా పోగై రహదారులపై రాకపోకలకు అంతరాయం కలిగిస్తున్నాయని పంచాయతీ కార్యదర్శి తెలిపారు. అయితే వాటిని ఎవరు చంపారో తమకు తెలియదని ధర్మాజీగూడెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.

ఇదీ చదవండి:

Roads Damage: అడుగుకో గుంత.. చినుకుపాటుకు బురదమయం.. ఎలా ప్రయాణం?

బస్సు అంటే ప్రాణం.. అందుకే ఇంటినే ఇలా...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.