కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో పేదలు ఇబ్బంది పడకూడదనే.. ప్రభుత్వం ఉచితంగా రేషన్ సరుకులు పంపిణీ చేస్తోందని ఎమ్మెల్యే ముదునూరి ప్రసాద్ రాజు చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో మూడో విడత రేషన్ సరకుల పంపిణీని ఆయన ప్రారంభించారు. నరసాపురం నియోజకవర్గంలో 41,270 మంది రేషన్ కార్డు దారులకు కందిపప్పు కిలో, బియ్యం 5 కిలోల చొప్పున అందజేస్తున్నట్టు చెప్పారు.
ఇదీ చదవండి: