ETV Bharat / state

ఆకివీడు వేణుగోపాలస్వామి ఆలయంలో చోరీ.. రూ.10లక్షలు విలువైన ఆభరణాలు అపహరణ - పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు వేణుగోపాలస్వామి గుడిలో దొంగతనం వార్తలు

పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడులోని వేణుగోపాలస్వామి ఆలయంలో దొంగతనం జరిగింది. దుండగులు.. స్వామి, అమ్మవార్ల వెండి ఆభరణాలు అపహరించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

theft
దొంగతనం
author img

By

Published : Apr 26, 2021, 4:37 PM IST

పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు గ్రామంలోని వేణుగోపాల స్వామి ఆలయంలో చోరీ జరిగింది. దుండగులు గునపాలతో ఆలయంలోని హుండీని పగలగొట్టి.. నగదును అపహరించారు. స్వామి, అమ్మవార్ల వెండి ఆభరణాలను సైతం దొంగిలించారు. వీటి విలువ సుమారు రూ.10 లక్షలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ దృశ్యాలు ఆలయంలోని సీసీ టీవీల్లో రికార్డయ్యాయి. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఏలూరు నుంచి వచ్చిన క్లూస్ టీం వేలిముద్రలను సేకరించారు.

పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు గ్రామంలోని వేణుగోపాల స్వామి ఆలయంలో చోరీ జరిగింది. దుండగులు గునపాలతో ఆలయంలోని హుండీని పగలగొట్టి.. నగదును అపహరించారు. స్వామి, అమ్మవార్ల వెండి ఆభరణాలను సైతం దొంగిలించారు. వీటి విలువ సుమారు రూ.10 లక్షలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ దృశ్యాలు ఆలయంలోని సీసీ టీవీల్లో రికార్డయ్యాయి. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఏలూరు నుంచి వచ్చిన క్లూస్ టీం వేలిముద్రలను సేకరించారు.

ఇదీ చదవండి: పిల్లలపై కొవిడ్‌ పిడుగు.. 45 రోజుల్లోనే 5 వేల మందికి వైరస్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.