ETV Bharat / state

వ్యాయామ ఉపాధ్యాయుడిపై పోలీసులకు విద్యార్థి తండ్రి ఫిర్యాదు

author img

By

Published : Oct 29, 2019, 4:50 PM IST

పశ్చిమగోదావరి జిల్లా టి నరసాపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయనిపై తొమ్మిదో తరగతి విద్యార్థి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కుమారున్ని ఉపాధ్యాయుడు వాతలు తేలేలా కొట్టాడని ఆరోపించారు. దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.

పోలీస్​స్టేషన్
ఉపాధ్యాయుడిపై పోలీసులకు విద్యార్థి తండ్రి ఫిర్యాదు

పశ్చిమగోదావరి జిల్లా టి నరసాపురంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడు... తన కుమారుడు షబ్బీర్​ బాషాను వాతలు తేలేలా కొట్టాడని అతని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పాఠశాలలో ఓ విద్యార్థినికి తలనొప్పిగా ఉందని... మందులు తీసుకురావాలని పీఈటీ ఉపాధ్యాయుడు రాజు... తనకు చెప్పినట్లు విద్యార్థి షబ్బీర్​ బాషా తెలిపాడు. కిలోమీటరు దూరంలో మందుల షాపుకు వెళ్లి ఆలస్యంగా వచ్చానని తనను ఉపాధ్యాయుడు కర్రతో కొట్టాడని ఆరోపించాడు. భయంతో విషయాన్ని తన తండ్రికి చెప్పినట్లు వివరించాడు. దీనిపై తండ్రి ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. అయితే తాను చిన్న దెబ్బ మాత్రమే వేసి గద్దించినట్లు ఉపాధ్యాయుడు చెబుతున్నారు.

ఉపాధ్యాయుడిపై పోలీసులకు విద్యార్థి తండ్రి ఫిర్యాదు

పశ్చిమగోదావరి జిల్లా టి నరసాపురంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడు... తన కుమారుడు షబ్బీర్​ బాషాను వాతలు తేలేలా కొట్టాడని అతని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పాఠశాలలో ఓ విద్యార్థినికి తలనొప్పిగా ఉందని... మందులు తీసుకురావాలని పీఈటీ ఉపాధ్యాయుడు రాజు... తనకు చెప్పినట్లు విద్యార్థి షబ్బీర్​ బాషా తెలిపాడు. కిలోమీటరు దూరంలో మందుల షాపుకు వెళ్లి ఆలస్యంగా వచ్చానని తనను ఉపాధ్యాయుడు కర్రతో కొట్టాడని ఆరోపించాడు. భయంతో విషయాన్ని తన తండ్రికి చెప్పినట్లు వివరించాడు. దీనిపై తండ్రి ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. అయితే తాను చిన్న దెబ్బ మాత్రమే వేసి గద్దించినట్లు ఉపాధ్యాయుడు చెబుతున్నారు.

ఇదీ చూడండి:

ప్రభుత్వం రాయితీ ఇచ్చినా.. ఆక్వా రైతులకు దక్కని భరోసా

Reporter. Nagaraju. Centure. Chintalapudi. Fele. Ap_tpg_10_28_student_avb_ap_10182 . యాంకర్ వాయిస్.. పశ్చిమగోదావరి జిల్లా టీ నరసాపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయడు తొమ్మిదో తరగతి విద్యార్థి షబ్బీర్ భాషా ను కర్రతో కొట్టడంతో అతని శరీరం పై వాతలు తేలాయి. వాయిస్ ఓవర్... పశ్చిమగోదావరి జిల్లా టీ నరసాపురం ఉన్నత పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడు కర్రతో శరీరంపై వాతలు వచ్చేలా కొట్టాడని తొమ్మిదో తరగతి విద్యార్థి షబ్బీర్ భాషా తెలిపాడు.. వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని తలనొప్పి వస్తుందని అదే పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న రాజుకి చెప్పింది. ఆయన స్పందిస్తూ పాఠశాలలో మందులు లేవని కిలోమీటరు దూరంలో ఉన్న మందుల షాపు కి వెళ్లి మందులు తేవాలని షబ్బీర్ భాషా ను పంపాడు. అయితే షబ్బీర్ భాషా వెసుకెళ్లిన సైకిల్ ఛైన్ పడటంతో అతను ఒక పిరియడ్ అయిన తర్వాత పాఠశాలకు వచ్చాడు. దీంతో ఆగ్రహించిన ఉపాధ్యాయుడు తన చేతిలో ఉన్న కర్రతో షబ్బీర్ బాషాను కొట్టాడు. భయపడిన విద్యార్థి ఇంటికి వెళ్లి తన తండ్రి కి చెప్పడంతో తండ్రి ఖాదర్ తన కుమారుడిని తీసుకుని స్థానిక పోలీసులు స్టేషన్ కు వెళ్లారు. అయితే ఈ విషయంలో పోలీసులు వివరాలు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని సదరు వ్యాయామ ఉపాధ్యాయుడిని అడుగగా తాను చిన్న దెబ్బ మాత్రమే కొట్టి గద్దించానని చెప్పారు. బైట్స్. 1. షబ్బీర్ భాషా. విద్యార్థి. 2. ఖాదర్. విద్యార్థి తండ్రి. 3. రాజు వ్యాయామ ఉపాధ్యాయుడు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.