ETV Bharat / state

వైరస్‌ సోకిన గర్భిణులకు ప్రత్యేక వైద్య సేవలు

author img

By

Published : May 31, 2021, 11:10 AM IST

సృష్టిలో అతివలకు మాతృత్వానికి మించిన సంతృప్తి మరొకటి లేదు. నవమాసాలు మోసి ఆరోగ్యవంతమైన బిడ్డలకు జన్మనివ్వాలని అమ్మ పరితపిస్తుంది. కనిపించని శత్రువు కరోనా చిన్నాపెద్దా అనే తేడా లేకుండా అందరిని వెంటాడుతోంది. వైరస్‌కు గర్భిణులు మినహాయింపు ఏమీ కాదు. కరోనా నిర్ధారణ అయినా మొక్కువోని ధైర్యంతో అమ్మలు తమను తాము కాపాడుకోవడంతో పాటు కడుపులోని బిడ్డను రక్షించుకునేందుకు పెద్ద యుద్ధమే చేస్తున్నారు. సాధారణ వ్యక్తులకు కరోనా వస్తే వైద్య సేవలపరంగా ఇబ్బందులు ఉండవు. అదే గర్భిణులకు వైరస్‌ సోకితే ఔషధాలు, పోషకాహారం.. ఇలా ప్రతి విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని వైద్యులు సూచిస్తున్నారు. ప్రసవానికి కొన్ని రోజులు, గంటల ముందు పాజిటివ్‌ నిర్ధారణ అయినా కొందరు మహిళలు వైరస్‌ను జయించి పండంటి బిడ్డలకు జన్మనిచ్చారు. మరికొందరు ముందే ఆందోళనకులోనై ప్రాణాలమీదకు తెచ్చుకున్నారు. కాబోయే అమ్మ.. కొవిడ్‌పట్ల జాగ్రత్తలు పాటించాలని వైద్యులు చెబుతున్నారు.

special treatment for corona infected pregnant ladies
special treatment for corona infected pregnant ladies

విజయవాడ జక్కంపూడి కాలనీకి చెందిన 23 ఏళ్ల గర్భిణికి నెలలు నిండాయి. ప్రసవానికి ఇంకా వారం వ్యవధి మాత్రమే మిగిలి ఉంది. అప్పటికే ఆమెకు దగ్గు, గొంతు నొప్పి, జలుబు ఉన్నాయి. అనుమానంగానే ఓ ప్రైవేటు ల్యాబ్‌కు వెళ్లి కరోనా నిర్ధారణ పరీక్ష చేయించుకున్నారు. తీరా ఆ పరీక్షలో ఆమెకి పాజిటివ్‌గా నిర్ధారణ జరిగింది. దీంతో కుటుంబ సభ్యులు కంగారు పడ్డారు. వైద్యుల సలహాతో సీటీ స్కాన్‌ చేయించుకున్నారు. అందులో కరోనా లక్షణాలు మైల్డ్‌గా ఉన్నట్లు స్పష్టమైంది. విజయవాడ పాత ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు విజయవాడ కొవిడ్‌ జీజీహెచ్‌కు (కొత్తాసుపత్రికి) సిఫారసు చేశారు. అక్కడికి వెళ్లి క్యాజువాలిటీలో వివరాలు నమోదు చేసి కాన్పుకు చేరారు. పండంటి ఆడ బిడ్డకు ఆ తల్లి జన్మనిచ్చింది. వైద్యులు చెప్పిన ధైర్యం, సలహాలు బాగా పని చేశాయని యువతి ఆనందం వ్యక్తం చేసింది.

కృష్ణా జిల్లాలో ప్రతి నెలా వేల సంఖ్యలో ప్రసవాలు జరుగుతుంటాయి. కరోనా రెండో దశ తీవ్రత పెరిగిన తరువాత ప్రసవం చేయాలంటే కరోనా పరీక్ష నివేదిక తీసుకురావాలని వైద్యులు కోరుతున్నారు. కరోనా నిర్ధారణ పరీక్షల్లో గర్భిణులకు ప్రాధాన్యమిస్తున్నారు. గర్భం దాల్చిన నాలుగు నెలల తరువాత నుంచి క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేస్తున్నారు. 9 నెలలు పూర్తిగా నిండి 15 రోజులు దాటిన తరువాత గర్భిణులకు ఆర్‌టీపీసీఆర్‌ పరీక్ష చేస్తున్నారు. అప్పుడు పాజిటివ్‌ నిర్ధారణ అయితే వెంటనే అప్రమత్తమై విజయవాడ జీజీహెచ్‌లో కరోనా బాధిత గర్భిణుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక వార్డుకు 108 వాహనంలో సంరక్షకుడి సహాయంతో పంపిస్తున్నారు. ప్రసవానికి ఒకటి రెండ్రోజుల ముందు ర్యాపిడ్‌ పరీక్ష చేసి వైరస్‌ సోకలేదని నిర్ధారణ అయితే నిర్భయంగా కాన్పు చేస్తున్నారు.వైద్యుల సూచనలు పాటిస్తూ పోషకాహారం తీసుకుంటూ ధైర్యంగా ఉన్నవారు త్వరగా కోలుకుంటున్నారు.

విద్యాధరపురానికి చెందిన 20 ఏళ్ల గర్భిణి కాన్పుకు 15 రోజుల ముందు కరోనా పరీక్ష చేయించుకోగా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. అప్పటికే ఆమెకు తీవ్ర జ్వరం, తలనొప్పి, దగ్గు, గొంతు నొప్పి, ఒళ్లు నొప్పులున్నాయి. యువతి ఆందోళన చెందింది. కరోనా ఫలితాన్ని డాక్టర్లకు చూపగా విజయవాడ జీజీహెచ్‌కు రిఫర్‌ చేశారు. కొవిడ్‌ ఆస్పత్రి అంటే భయం వేయడంతో పలు ప్రైవేటు ఆస్పత్రుల్లో పడక కోసం ప్రయత్నించారు. ఎక్కడా కరోనా వచ్చిన గర్భిణులకు కాన్పు చేయకపోవడంతో చివరకు విజయవాడ జీజీహెచ్‌కు వచ్చారు. కాన్పుకు వారం రోజుల ముందు ఆమెకు కాస్త లక్షణాలు తగ్గాయి. విజయవాడ జీజీహెచ్‌లో కాన్పు జరిగింది. పండంటి మగ బిడ్డకు ఆ యువతి జన్మనిచ్చింది. కాన్పు అనంతరం వైద్యుల పర్యవేక్షణలో రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్‌లను ఇచ్చారు. యువతి ఆరోగ్యం సైతం మెరుగుపడింది. తన బిడ్డకు కొవిడ్‌ సోకకుండా వైద్యులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారని, వారి రుణం ఏమిచ్చి తీర్చుకోగలమని కన్నీటి పర్యంతమైంది. డాక్టర్లు కంటికి రెప్పలా కాపాడుకున్నారని చెప్పింది.

ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ

కొవిడ్‌ బాధిత గర్భిణుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాల్సిన పరిస్థితి ఉంది. సాధారణ వ్యక్తుల్లా వారికి అన్నిరకాల ఔషధాలు వాడేందుకు అవకాశం లేదు. పారాసెటమాల్‌, అజిత్రోమైసిన్‌తో పాటు బీకాంప్లెక్సు, విటమిన్‌, జింకు ఔషధాలు వాడవచ్ఛు ఐవర్‌మెక్టిన్‌లాంటి ఔషధాలు వాడకూడదు. త్వరగా వారు ఆరోగ్యవంతులు అవ్వాలని ఏవిపడితే అవి వాడితే తల్లీబిడ్డ ఆరోగ్యానికి ముప్పు ఏర్పడుతుంది. పరిమితంగా ఔషధాలు వాడడంతో పాటు సమతుల ఆహారం, ఎటువంటి ఒత్తిడికి లోనవ్వకుండా మంచి నిద్ర కాబోయే అమ్మలకు ఎంతో అవసరం.-డాక్టర్‌ మంత్రునాయక్‌, గైనకాలజిస్టు

ప్రభుత్వ ఆసుపత్రులే అండగా

కాన్పుకు 15 రోజుల ముందు కొవిడ్‌ నెగెటివ్‌ సర్టిఫికెట్‌ అవసరం. కానీ పరీక్ష చేయించుకున్న తరువాత పలువురు గర్భిణులు పాజిటివ్‌ వచ్చినా నిజం దాస్తున్నారు. కాన్పు సమయంలో వైద్యులకు కరోనా లక్షణాలు కనబడితే తక్షణం ర్యాపిడ్‌ పరీక్ష చేసి పాజిటివ్‌గా తెలితే వైద్యుల పర్యవేక్షణలో 108 అంబులెన్స్‌లో విజయవాడ జీజీహెచ్‌కు తరలిస్తున్నారు. అక్కడ ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశాం. 24 గంటలు వైద్యుల పర్యవేక్షణలో గర్భిణులు ఉంటారు.అన్ని జాగ్రత్తలు తీసుకుని తల్లీబిడ్డను కాపాడుతున్నాం. దగ్గు, జ్వరం, జలుబు, గొంతు నొప్పి వంటి లక్షణాలు ఉంటే వివరించాలి. తద్వారా వైద్యానికి సులభం అవుతుంది. కొవిడ్‌ సోకిన గర్భిణులకు ప్రభుత్వ ఆసుపత్రులే అండగా నిలుస్తున్నాయి. - డీఎంహెచ్‌వో డా.ఎం.సుహాసిని

ఇదీ చదవండి:

మది నిండా అమ్మ జ్ఞాపకాలే.. అనాథ శవంగా అంత్యక్రియలు జరిగాయనుకున్నాడు కానీ..!

విజయవాడ జక్కంపూడి కాలనీకి చెందిన 23 ఏళ్ల గర్భిణికి నెలలు నిండాయి. ప్రసవానికి ఇంకా వారం వ్యవధి మాత్రమే మిగిలి ఉంది. అప్పటికే ఆమెకు దగ్గు, గొంతు నొప్పి, జలుబు ఉన్నాయి. అనుమానంగానే ఓ ప్రైవేటు ల్యాబ్‌కు వెళ్లి కరోనా నిర్ధారణ పరీక్ష చేయించుకున్నారు. తీరా ఆ పరీక్షలో ఆమెకి పాజిటివ్‌గా నిర్ధారణ జరిగింది. దీంతో కుటుంబ సభ్యులు కంగారు పడ్డారు. వైద్యుల సలహాతో సీటీ స్కాన్‌ చేయించుకున్నారు. అందులో కరోనా లక్షణాలు మైల్డ్‌గా ఉన్నట్లు స్పష్టమైంది. విజయవాడ పాత ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు విజయవాడ కొవిడ్‌ జీజీహెచ్‌కు (కొత్తాసుపత్రికి) సిఫారసు చేశారు. అక్కడికి వెళ్లి క్యాజువాలిటీలో వివరాలు నమోదు చేసి కాన్పుకు చేరారు. పండంటి ఆడ బిడ్డకు ఆ తల్లి జన్మనిచ్చింది. వైద్యులు చెప్పిన ధైర్యం, సలహాలు బాగా పని చేశాయని యువతి ఆనందం వ్యక్తం చేసింది.

కృష్ణా జిల్లాలో ప్రతి నెలా వేల సంఖ్యలో ప్రసవాలు జరుగుతుంటాయి. కరోనా రెండో దశ తీవ్రత పెరిగిన తరువాత ప్రసవం చేయాలంటే కరోనా పరీక్ష నివేదిక తీసుకురావాలని వైద్యులు కోరుతున్నారు. కరోనా నిర్ధారణ పరీక్షల్లో గర్భిణులకు ప్రాధాన్యమిస్తున్నారు. గర్భం దాల్చిన నాలుగు నెలల తరువాత నుంచి క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేస్తున్నారు. 9 నెలలు పూర్తిగా నిండి 15 రోజులు దాటిన తరువాత గర్భిణులకు ఆర్‌టీపీసీఆర్‌ పరీక్ష చేస్తున్నారు. అప్పుడు పాజిటివ్‌ నిర్ధారణ అయితే వెంటనే అప్రమత్తమై విజయవాడ జీజీహెచ్‌లో కరోనా బాధిత గర్భిణుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక వార్డుకు 108 వాహనంలో సంరక్షకుడి సహాయంతో పంపిస్తున్నారు. ప్రసవానికి ఒకటి రెండ్రోజుల ముందు ర్యాపిడ్‌ పరీక్ష చేసి వైరస్‌ సోకలేదని నిర్ధారణ అయితే నిర్భయంగా కాన్పు చేస్తున్నారు.వైద్యుల సూచనలు పాటిస్తూ పోషకాహారం తీసుకుంటూ ధైర్యంగా ఉన్నవారు త్వరగా కోలుకుంటున్నారు.

విద్యాధరపురానికి చెందిన 20 ఏళ్ల గర్భిణి కాన్పుకు 15 రోజుల ముందు కరోనా పరీక్ష చేయించుకోగా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. అప్పటికే ఆమెకు తీవ్ర జ్వరం, తలనొప్పి, దగ్గు, గొంతు నొప్పి, ఒళ్లు నొప్పులున్నాయి. యువతి ఆందోళన చెందింది. కరోనా ఫలితాన్ని డాక్టర్లకు చూపగా విజయవాడ జీజీహెచ్‌కు రిఫర్‌ చేశారు. కొవిడ్‌ ఆస్పత్రి అంటే భయం వేయడంతో పలు ప్రైవేటు ఆస్పత్రుల్లో పడక కోసం ప్రయత్నించారు. ఎక్కడా కరోనా వచ్చిన గర్భిణులకు కాన్పు చేయకపోవడంతో చివరకు విజయవాడ జీజీహెచ్‌కు వచ్చారు. కాన్పుకు వారం రోజుల ముందు ఆమెకు కాస్త లక్షణాలు తగ్గాయి. విజయవాడ జీజీహెచ్‌లో కాన్పు జరిగింది. పండంటి మగ బిడ్డకు ఆ యువతి జన్మనిచ్చింది. కాన్పు అనంతరం వైద్యుల పర్యవేక్షణలో రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్‌లను ఇచ్చారు. యువతి ఆరోగ్యం సైతం మెరుగుపడింది. తన బిడ్డకు కొవిడ్‌ సోకకుండా వైద్యులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారని, వారి రుణం ఏమిచ్చి తీర్చుకోగలమని కన్నీటి పర్యంతమైంది. డాక్టర్లు కంటికి రెప్పలా కాపాడుకున్నారని చెప్పింది.

ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ

కొవిడ్‌ బాధిత గర్భిణుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాల్సిన పరిస్థితి ఉంది. సాధారణ వ్యక్తుల్లా వారికి అన్నిరకాల ఔషధాలు వాడేందుకు అవకాశం లేదు. పారాసెటమాల్‌, అజిత్రోమైసిన్‌తో పాటు బీకాంప్లెక్సు, విటమిన్‌, జింకు ఔషధాలు వాడవచ్ఛు ఐవర్‌మెక్టిన్‌లాంటి ఔషధాలు వాడకూడదు. త్వరగా వారు ఆరోగ్యవంతులు అవ్వాలని ఏవిపడితే అవి వాడితే తల్లీబిడ్డ ఆరోగ్యానికి ముప్పు ఏర్పడుతుంది. పరిమితంగా ఔషధాలు వాడడంతో పాటు సమతుల ఆహారం, ఎటువంటి ఒత్తిడికి లోనవ్వకుండా మంచి నిద్ర కాబోయే అమ్మలకు ఎంతో అవసరం.-డాక్టర్‌ మంత్రునాయక్‌, గైనకాలజిస్టు

ప్రభుత్వ ఆసుపత్రులే అండగా

కాన్పుకు 15 రోజుల ముందు కొవిడ్‌ నెగెటివ్‌ సర్టిఫికెట్‌ అవసరం. కానీ పరీక్ష చేయించుకున్న తరువాత పలువురు గర్భిణులు పాజిటివ్‌ వచ్చినా నిజం దాస్తున్నారు. కాన్పు సమయంలో వైద్యులకు కరోనా లక్షణాలు కనబడితే తక్షణం ర్యాపిడ్‌ పరీక్ష చేసి పాజిటివ్‌గా తెలితే వైద్యుల పర్యవేక్షణలో 108 అంబులెన్స్‌లో విజయవాడ జీజీహెచ్‌కు తరలిస్తున్నారు. అక్కడ ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశాం. 24 గంటలు వైద్యుల పర్యవేక్షణలో గర్భిణులు ఉంటారు.అన్ని జాగ్రత్తలు తీసుకుని తల్లీబిడ్డను కాపాడుతున్నాం. దగ్గు, జ్వరం, జలుబు, గొంతు నొప్పి వంటి లక్షణాలు ఉంటే వివరించాలి. తద్వారా వైద్యానికి సులభం అవుతుంది. కొవిడ్‌ సోకిన గర్భిణులకు ప్రభుత్వ ఆసుపత్రులే అండగా నిలుస్తున్నాయి. - డీఎంహెచ్‌వో డా.ఎం.సుహాసిని

ఇదీ చదవండి:

మది నిండా అమ్మ జ్ఞాపకాలే.. అనాథ శవంగా అంత్యక్రియలు జరిగాయనుకున్నాడు కానీ..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.