ETV Bharat / state

కొయ్యలగూడెంలో రహదారి విస్తరణ పనుల్లో ఉద్రిక్తత

పశ్చిమ గోదావరి జిల్లాలో రహదారి విస్తరణ పనులు ఉద్రిక్తతలకు దారి తీశాయి. విస్తరణలో భాగంగా 516 డీ జాతీయ రహదారిపై ఉన్న నివాస గృహాలు, దుకాణాలను యంత్రాల ద్వారా తొలగించారు. ఈ క్రమంలో అధికారులతో బాధిత ప్రజలకు వాగ్వాదం జరిగింది.

author img

By

Published : Aug 31, 2021, 8:49 PM IST

Road widening works
రహదారి విస్తరణ పనులు

పశ్చిమ గోదావరి జిల్లా కొయ్యలగూడెంలో రహదారి విస్తరణ పనులు ఉద్రిక్తతలకు దారి తీశాయి. జాతీయ రహదారి విస్తరణలో భాగంగా ఆక్రమణలను అధికారులు తొలగించారు. 516డీ జాతీయ రహదారిపై ఉన్న నివాస గృహాలు, దుకాణాలను యంత్రాల ద్వారా కూలగొట్టారు. స్థానిక ప్రజలు మొదట్లో కొంత వారిని ప్రతిఘటించారు.

భారీ పోలీస్ బందోబస్తుతో వచ్చిన అధికారులు స్థానికులను అడ్డుకున్నారు. పోలీసుల బందోబస్తు మధ్య వందలాది దుకాణాలు, నివాస గృహాలను అధికారులు తొలగించారు. తొలగిస్తున్న దుకాణాలు, నివాసగృహాలు ఆర్అండ్​బీ రహదారిపై ఉన్నాయని అధికారులు స్పష్టం చేశారు.

పశ్చిమ గోదావరి జిల్లా కొయ్యలగూడెంలో రహదారి విస్తరణ పనులు ఉద్రిక్తతలకు దారి తీశాయి. జాతీయ రహదారి విస్తరణలో భాగంగా ఆక్రమణలను అధికారులు తొలగించారు. 516డీ జాతీయ రహదారిపై ఉన్న నివాస గృహాలు, దుకాణాలను యంత్రాల ద్వారా కూలగొట్టారు. స్థానిక ప్రజలు మొదట్లో కొంత వారిని ప్రతిఘటించారు.

భారీ పోలీస్ బందోబస్తుతో వచ్చిన అధికారులు స్థానికులను అడ్డుకున్నారు. పోలీసుల బందోబస్తు మధ్య వందలాది దుకాణాలు, నివాస గృహాలను అధికారులు తొలగించారు. తొలగిస్తున్న దుకాణాలు, నివాసగృహాలు ఆర్అండ్​బీ రహదారిపై ఉన్నాయని అధికారులు స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:

Nara Lokesh: పోలవరం నిర్వాసితులకు పరిహారం ఎందుకు ఇవ్వడం లేదు?: లోకేశ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.