ETV Bharat / state

రోడ్డుప్రమాదం... ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు

author img

By

Published : May 27, 2020, 7:46 PM IST

ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి ద్విచక్రవాహనంపై నుంచి పడి ఒకరు మృతిచెందగా, మరో ముగ్గురు గాయాలపాలైన ఘటన.. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో జరిగింది.

road accident in jangareddy gudem west godavari district
జంగారెడ్డి గూడెంలో రోడ్డు ప్రమాదం

పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలోని తల్లాడ-దేవరపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్ర గాయాల పాలయ్యారు. బుట్టాయగూడెనికి చెందిన ఇజ్రాయిల్, కుమారి దంపతులు జంగారెడ్డిగూడెం నుంచి బైక్​పై వస్తూ ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి అదుపుతప్పి రోడ్డుపై పడ్డారు.

ఈ ఘటనలో ఇజ్రాయిల్​కు బలమైన గాయం అయ్యి చికిత్స పొందుతూ మృతిచెందారు. అతని భార్య కుమారి ఏలూరు ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదంలో లారీ కూడా అదుపు తప్పి బోల్తా పడటంతో డ్రైవర్​కు, క్లీనర్​కు గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలోని తల్లాడ-దేవరపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్ర గాయాల పాలయ్యారు. బుట్టాయగూడెనికి చెందిన ఇజ్రాయిల్, కుమారి దంపతులు జంగారెడ్డిగూడెం నుంచి బైక్​పై వస్తూ ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి అదుపుతప్పి రోడ్డుపై పడ్డారు.

ఈ ఘటనలో ఇజ్రాయిల్​కు బలమైన గాయం అయ్యి చికిత్స పొందుతూ మృతిచెందారు. అతని భార్య కుమారి ఏలూరు ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదంలో లారీ కూడా అదుపు తప్పి బోల్తా పడటంతో డ్రైవర్​కు, క్లీనర్​కు గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చదవండి... చుట్టూ నీళ్లున్నా... వారికి తాగునీరు లేదు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.