ETV Bharat / state

అపార్ట్​మెంట్​పై నుంచి దూకి యువకుడు ఆత్మహత్య

author img

By

Published : May 23, 2020, 6:43 PM IST

ఏ కష్టమొచ్చిందో ఆ యువకుడు అపార్ట్​మెంట్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అది కూడా అతని ఇంటి నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రదేశానికి వచ్చి మరీ ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ విషాదకర ఘటన పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని లేఖవిహార్ అపార్ట్​మెంట్ వద్ద జరిగింది.

person committed suicide at thadepalligudem
అపార్ట్​మెంట్​పై నుంచి దూకి యువకుడు ఆత్మహత్య
అపార్ట్​మెంట్​పై నుంచి దూకి యువకుడు ఆత్మహత్య

పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం రేలంగి చిత్రమందిర్ వెనుక భాగ్యలక్ష్మి పేటకు చెందిన మట్టల చంద్రకుమార్ అలియాస్ సిద్ధు అనే యువకుడు అపార్ట్​మెంట్​పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన ఇంటికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న అపార్ట్​మెంట్​ దగ్గరకు వచ్చి ఆత్మహత్య చేసుకోవటం అనుమానాలకు దారి తీస్తోంది.

అతడు భవనం ఎక్కడం, కింద పడి మృతి చెందడం సీసీ టీవీ ఫుటేజిలో క్షుణ్ణంగా రికార్డు అయ్యింది. పోలీసులు మృతుడికి కరోనా పరీక్షలు నిర్వహించారు. నెగిటివ్ రాగా.. మృతదేహాన్ని పంచనామా కోసం తాడేపల్లిగూడెం ఆస్పత్రికి తరలించారు. ఘటన స్థలంలోని మొబైల్ ఫోన్, సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

సమిష్టి కష్టం.. సమస్యకు చూపింది పరిష్కారం!

అపార్ట్​మెంట్​పై నుంచి దూకి యువకుడు ఆత్మహత్య

పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం రేలంగి చిత్రమందిర్ వెనుక భాగ్యలక్ష్మి పేటకు చెందిన మట్టల చంద్రకుమార్ అలియాస్ సిద్ధు అనే యువకుడు అపార్ట్​మెంట్​పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన ఇంటికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న అపార్ట్​మెంట్​ దగ్గరకు వచ్చి ఆత్మహత్య చేసుకోవటం అనుమానాలకు దారి తీస్తోంది.

అతడు భవనం ఎక్కడం, కింద పడి మృతి చెందడం సీసీ టీవీ ఫుటేజిలో క్షుణ్ణంగా రికార్డు అయ్యింది. పోలీసులు మృతుడికి కరోనా పరీక్షలు నిర్వహించారు. నెగిటివ్ రాగా.. మృతదేహాన్ని పంచనామా కోసం తాడేపల్లిగూడెం ఆస్పత్రికి తరలించారు. ఘటన స్థలంలోని మొబైల్ ఫోన్, సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

సమిష్టి కష్టం.. సమస్యకు చూపింది పరిష్కారం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.