ETV Bharat / state

ఉపాధి హామీ పథకం నిధులతో నాసిరకం నిర్మాణాలు

author img

By

Published : Mar 1, 2020, 5:36 PM IST

ఉపాధి హామీ పథకంలో భాగంగా గ్రామాల్లో వేస్తున్న సిమెంట్ రహదారులు, మురుగు కాలువల నిర్మాణాల్లో నాసిరకం ముడిసరకు వాడుతున్నారని ప్రజలు అరోపిస్తున్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

nferior work in employment guarantee scheme
ఉపాధి హామీ పథకంలో నాసిరకం పనులు
ఉపాధి హామీ పథకం నిధులతో నాసిరకం నిర్మాణాలు
గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా దెందులూరు నియోజకవర్గంలో సుమారు రూ.80 కోట్ల విలువైన పనులు చేస్తున్నారు. వీటిలో సిమెంట్ రహదారులు, సైడ్ కాలువల నిర్మాణాలున్నాయి. పెదవేగి మండలం కొప్పులవారిగూడెం, జగన్నాధపురం తదితర గ్రామాల్లో నాసిరకంగా పనులు జరుగుతున్నాయి. నిబంధనల ప్రకారం తమ్మిలేరు, గుండేరు ఇసుకను నిర్మాణం పనులకు ఉపయోగించొద్దు. కానీ అక్కడ అత్యధిక శాతం అదే ఇసుకను పనులకు ఉపయోగిస్తున్నారు. జగన్నాధపురంలో క్వారీ డస్ట్ ఉపయోగిస్తున్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. ఇదీ చూడండి:అనుమతులు లేకుండా ఇసుక తరలింపు

ఉపాధి హామీ పథకం నిధులతో నాసిరకం నిర్మాణాలు
గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా దెందులూరు నియోజకవర్గంలో సుమారు రూ.80 కోట్ల విలువైన పనులు చేస్తున్నారు. వీటిలో సిమెంట్ రహదారులు, సైడ్ కాలువల నిర్మాణాలున్నాయి. పెదవేగి మండలం కొప్పులవారిగూడెం, జగన్నాధపురం తదితర గ్రామాల్లో నాసిరకంగా పనులు జరుగుతున్నాయి. నిబంధనల ప్రకారం తమ్మిలేరు, గుండేరు ఇసుకను నిర్మాణం పనులకు ఉపయోగించొద్దు. కానీ అక్కడ అత్యధిక శాతం అదే ఇసుకను పనులకు ఉపయోగిస్తున్నారు. జగన్నాధపురంలో క్వారీ డస్ట్ ఉపయోగిస్తున్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. ఇదీ చూడండి:అనుమతులు లేకుండా ఇసుక తరలింపు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.