ETV Bharat / state

కరోనాపై పోరుకు రూ. 27 లక్షల విరాళం - కరోనాపై పోరుకు సహాయం

కరోనాపై పోరు సాగించేందుకు దాతలు ముందుకొస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకు నియోజకవర్గ పరిధిలో సేకరించిన రూ.27 లక్షల విరాళాలను ఎమ్మెల్యే వెంకట నాగేశ్వరరావు ముఖ్యమంత్రి జగన్​కు అందజేశారు.

కరోనాపై పోరుకు రూ. 27 లక్షల విరాళం
కరోనాపై పోరుకు రూ. 27 లక్షల విరాళం
author img

By

Published : Jul 16, 2020, 4:38 AM IST

కరోనా వైరస్ విపత్తు నివారణ సహాయ చర్యల కోసం పశ్చిమగోదావరి జిల్లా తణుకు శాసనసభ్యులు కారుమూరి వెంకట నాగేశ్వరరావు రూ. 27 లక్షల విరాళాలు సేకరించారు. నియోజకవర్గ పరిధిలోని వివిధ సంస్థలు, వ్యాపారులు, దాతలు ద్వారా విరాళాలు సేకరించినట్లు నాగేశ్వరరావు తెలిపారు. ఈ మెుత్తానికి సంబంధించిన చెక్కును అమరావతి కేంద్ర కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్​కు అందజేశారు. కరోనాపై పోరుకు తనవంతుగా కృషి చేసిన నాగేశ్వరరావును సీఎం అభినందించారు. ఈ సందర్భంగా తణుకు నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న వివిధ సంక్షేమ పథకాల అమలు తీరు, అభివృద్ధి పనుల వివరాలను జగన్ దృష్టికి తీసుకెళ్లారు.

ఇదీచదవండి

కరోనా వైరస్ విపత్తు నివారణ సహాయ చర్యల కోసం పశ్చిమగోదావరి జిల్లా తణుకు శాసనసభ్యులు కారుమూరి వెంకట నాగేశ్వరరావు రూ. 27 లక్షల విరాళాలు సేకరించారు. నియోజకవర్గ పరిధిలోని వివిధ సంస్థలు, వ్యాపారులు, దాతలు ద్వారా విరాళాలు సేకరించినట్లు నాగేశ్వరరావు తెలిపారు. ఈ మెుత్తానికి సంబంధించిన చెక్కును అమరావతి కేంద్ర కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్​కు అందజేశారు. కరోనాపై పోరుకు తనవంతుగా కృషి చేసిన నాగేశ్వరరావును సీఎం అభినందించారు. ఈ సందర్భంగా తణుకు నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న వివిధ సంక్షేమ పథకాల అమలు తీరు, అభివృద్ధి పనుల వివరాలను జగన్ దృష్టికి తీసుకెళ్లారు.

ఇదీచదవండి

'రూ.45 వేల ఇంజక్షన్​ను.. రూ.90 వేలకు అమ్ముతున్నారు'​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.