వైద్యం వికటించి యువతి మృతిచెందిన ఘటన తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురంలో జరిగింది. మృతురాలు భీమవరంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో బీటెక్ చదివే సమయంలో... భీమవరం పట్టణానికి చెందిన గ్రంధి సాయిరామ్తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఈ వ్యవహాహం యువతి పెద్దలకు తెలియటంతో ఆమెను మధ్యలోనే కళాశాల మాన్పించారు.
సాయిరామ్తో ఏర్పడిన శారీరక సంబంధం కారణంగా ఆమె గర్భం దాల్చింది. అబార్షన్ చేయించేందుకు కాళ్ల మండంలోని బొండాడ గ్రామానికి చెందిన ఆర్ఎంపీ వైద్యుడు యార్ల రమేష్ను సంప్రదించారు. బొండాడలో అబార్షన్ చేస్తున్న సమయంలో వైద్యం వికటించి యువతి మృతిచెందింది. భయాందోళనకు గురైన ఆర్ఎంపీ డాక్టర్ వెంటనే పోలీస్స్టేషన్లో లొంగిపోయాడు. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు.
ఇదీ చదవండి: పాములు కనిపిస్తే ఆ యువకుడు పట్టి రక్షిస్తాడు..!