పశ్చిమగోదావరి జిల్లాలో శరన్నవరాత్రులు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా తణుకు మండలం దువ్వ గ్రామంలో ఉన్న దానేశ్వరి అమ్మవారు సరస్వతి దేవి అలంకారంలో భక్తులను అలరించారు. మయూర వాహనంపై ధవళ వస్త్రాలను ధరించి జ్ఞానానికి అధిష్టాన దేవత అయిన చదువుల తల్లిగా దానేశ్వరి అమ్మవారు... భక్తుల పూజలందుకుంటున్నారు.
విద్యార్థులు తమని ఉన్నత విద్యా వంతులు అయ్యేలా ఆశీర్వదించమని కోరుతూ సామూహిక పూజలు చేశారు. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా భక్తుల దర్శనానికి ఆలయ పాలకవర్గం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
ఇదీ చదవండీ...