ETV Bharat / state

రూ. 18 లక్షల విలువైన గంజాయి పట్టివేత

author img

By

Published : May 24, 2021, 7:40 PM IST

గంజాయి అక్రమంగా తరలిస్తున్న ముఠాను పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమల పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి సుమారు రూ. 18 లక్షల విలువ చేసే మాదక ద్రవ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

smuggling cannabis gang arrest
గంజాయి అక్రమంగా తరలిస్తున్న ముఠా అరెస్టు

పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమల మండలం లక్ష్మీ నగరం వద్ద 800 కేజీల గంజాయి పట్టుబడింది. తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతం నుంచి తమిళనాడుకు రెండు లారీల్లో గంజాయి తరలిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. పట్టుబడ్డ గంజాయి విలువ సుమారు రూ. 18 లక్షలు ఉంటుందని పోలీసులు వివరించారు. ఈ కేసులో నలుగురిని అరెస్టు చేసిన పోలీసులు.. రెండు లారీలు సీజ్​ చేశారు. తమిళనాడుకు చెందిన రాజన్..ఈ స్మగ్లింగ్​కు పాల్పడుతున్నాడని.. త్వరలో అతన్ని పట్టుకుంటామని భీమడోలు సీఐ సుబ్బారావు తెలిపారు.

ఇదీ చదవండి..

పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమల మండలం లక్ష్మీ నగరం వద్ద 800 కేజీల గంజాయి పట్టుబడింది. తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతం నుంచి తమిళనాడుకు రెండు లారీల్లో గంజాయి తరలిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. పట్టుబడ్డ గంజాయి విలువ సుమారు రూ. 18 లక్షలు ఉంటుందని పోలీసులు వివరించారు. ఈ కేసులో నలుగురిని అరెస్టు చేసిన పోలీసులు.. రెండు లారీలు సీజ్​ చేశారు. తమిళనాడుకు చెందిన రాజన్..ఈ స్మగ్లింగ్​కు పాల్పడుతున్నాడని.. త్వరలో అతన్ని పట్టుకుంటామని భీమడోలు సీఐ సుబ్బారావు తెలిపారు.

ఇదీ చదవండి..

హైవే కిల్లర్‌ మున్నా కేసులో సంచలన తీర్పు.. 'నైలాన్ తాడుతో గొంతులు కోసేవాడు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.