పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురంలో గంజాయి తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. విశాఖ జిల్లా నర్సీపట్నం నుంచి హైదరాబాదు తరలిస్తుండగా పట్టుకున్నారు. ముందస్తు సమాచారంతోనే 9 లక్షలు విలువ చేసే గంజాయి, 2 కార్లు స్వాధీనం చేసుకున్నారు. మరి కొంతమంది తప్పించుకున్నారని త్వరలోనే వారినీ పట్టుకుంటామని జంగారెడ్డిగూడెం సీఐ నాయక్ తెలిపారు.
ఇవీ చదవండి