ETV Bharat / state

'హామీల అమలు లేవు.. అబద్ధపు ప్రచారాలు తప్ప'

author img

By

Published : May 31, 2020, 3:57 PM IST

ఏడాది పాలనలో వైకాపా ప్రభుత్వం ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయలేదని... తణుకు మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ విమర్శించారు. అబద్ధపు ప్రచారాలు తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు.

former mla aarimilli radhakrishna criticises ycp government
ఆరిమిల్లి రాధాకృష్ణ, మాజీ ఎమ్మెల్యే

వైకాపా ప్రభుత్వ ఏడాది పాలనలో ప్రజలకు ఎటువంటి మేలు జరగలేదని పశ్చిమగోదావరి జిల్లా తణుకు మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. మండలంలోని వేల్పూరులో మాట్లాడుతూ.. సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయకపోగా.. నవరత్నాల పేరుతో ప్రజలలను మోసం చేశారని ధ్వజమెత్తారు.

ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను 90 శాతం అమలు చేశామని అబద్ధపు ప్రకటనలు ఇచ్చుకుంటున్నారని విమర్శించారు. అర్హులందరికీ ప్రభుత్వ పథకాలను అందేలా చూడాలని డిమాండ్ చేశారు.

వైకాపా ప్రభుత్వ ఏడాది పాలనలో ప్రజలకు ఎటువంటి మేలు జరగలేదని పశ్చిమగోదావరి జిల్లా తణుకు మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. మండలంలోని వేల్పూరులో మాట్లాడుతూ.. సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయకపోగా.. నవరత్నాల పేరుతో ప్రజలలను మోసం చేశారని ధ్వజమెత్తారు.

ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను 90 శాతం అమలు చేశామని అబద్ధపు ప్రకటనలు ఇచ్చుకుంటున్నారని విమర్శించారు. అర్హులందరికీ ప్రభుత్వ పథకాలను అందేలా చూడాలని డిమాండ్ చేశారు.

ఇవీ చదవండి... చేపల వేటకు రంగం సిద్ధం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.