పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమల దేవస్థానం ఈవోగా పనిచేస్తున్న ప్రభాకరరావును తన మాతృ శాఖకు బదిలీ చేయాలని దేవాదాయ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి జీఎస్వీ ప్రసాద్ ఎండోమెంట్ స్పెషల్ కమిషనర్ను ఆదేశించారు. ఆ స్థానంలో మరొకరిని నియమించాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఇంతకుముందు ప్రభాకర్ రావు ఏలూరు డిప్యూటీ కలెక్టరుగా పని చేశారు. ఆ సమయంలో ఏసీబీ అధికారులమంటూ కొంతమంది ప్రభాకర్ రావు నుంచి 1.97 లక్షలు వసూలు చేశారు. ఈ విషయం వెలుగులోకి రావడంతో అసలు ఈ సొమ్ము ఎందుకు జమ చేయాల్సి వచ్చిందనే కోణంలో అనిశా దేవస్థానంలోని అన్ని విభాగాల్లో సోదాలు నిర్వహించారు. ప్రస్తుతం విచారణ జరుగుతున్నందున ఈ మేరకు చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇదీచదవండి