ETV Bharat / state

Eluru Mayor: ఏలూరు మేయర్‌గా దూదేకుల మహిళకు అవకాశం: సజ్జల

author img

By

Published : Jul 27, 2021, 11:41 AM IST

వైకాపా అనుబంధ కుల సంఘాలకు చెందిన వారిని కుల సంఘనాయకులుగా కాకుండా పార్టీ నేతలుగానే చూస్తామని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. సోమవారం వైకాపా కేంద్ర కార్యాలయంలో నూర్‌బాషా / దూదేకుల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన ప్రసంగించారు.

dudekula-woman-as-the-mayor-of-eluru
ఏలూరు మేయర్‌గా దూదేకుల మహిళకు అవకాశం: సజ్జల

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నగరపాలక సంస్థ మేయర్‌ పదవిని దూదేకులకు చెందిన మహిళకు కేటాయించనున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. మహిళా సాధికారత సాధన దిశగా ముఖ్యమంత్రి జగన్‌ అందిస్తున్న భరోసాతో మహిళలు రాజకీయంగా ఎదగాలని సూచించారు.

వెనుకబడిన వర్గాలకు రాజకీయ, సామాజిక ప్రాధాన్యతను ముఖ్యమంత్రి జగన్​ కల్పించారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీనివాస వేణుగోపాలకృష్ణ చెప్పారు. సమావేశంలో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, నూర్‌బాషా కార్పొరేషన్‌ ఛైర్‌పర్సన్‌ ఫక్రూబీ, ఆ సంస్థ డైరెక్టర్లు పాల్గొన్నారు.

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నగరపాలక సంస్థ మేయర్‌ పదవిని దూదేకులకు చెందిన మహిళకు కేటాయించనున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. మహిళా సాధికారత సాధన దిశగా ముఖ్యమంత్రి జగన్‌ అందిస్తున్న భరోసాతో మహిళలు రాజకీయంగా ఎదగాలని సూచించారు.

వెనుకబడిన వర్గాలకు రాజకీయ, సామాజిక ప్రాధాన్యతను ముఖ్యమంత్రి జగన్​ కల్పించారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీనివాస వేణుగోపాలకృష్ణ చెప్పారు. సమావేశంలో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, నూర్‌బాషా కార్పొరేషన్‌ ఛైర్‌పర్సన్‌ ఫక్రూబీ, ఆ సంస్థ డైరెక్టర్లు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

షూటింగ్​లో ప్చ్​.. మిక్స్​డ్​ ఈవెంట్​లోనూ మను- సౌరభ్​ జోడీ ఓటమి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.