ETV Bharat / state

"రీఎంట్రీలు ఉంటేనే ఓట్లు తొలగిస్తున్నాం..."

ఓటు నమోదుకు ఫారం-6 దరఖాస్తు చేసుకోవడానికి ప్రజలు మీ-సేవా కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు. పారం-7 దరఖాస్తులపై ప్రత్యేక చొరవ తీసుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. ఈ మేరకు రీఎంట్రీలు ఉంటేనే తొలగిస్తున్నామని బూత్ స్థాయి అధికారులు చెబుతున్నారు.

author img

By

Published : Mar 13, 2019, 9:35 AM IST

ఫార్మ్-6 దరఖాస్తునకు మీ-సేవా కేంద్రాల వద్ద ఓటర్లు


పశ్చిమగోదావరిజిల్లాలో ఓటర్ల జాబితా తప్పులతడకగా మారింది. బతికున్నవాళ్ల ఓట్లనే తొలగించారు. చనిపోయారంటూ కారణం చూపారు. కొందరి ఓట్లు రెండేసి పోలింగ్ బూత్ కేంద్రాల్లో ఉన్నాయి. ఓటరు గుర్తింపు కార్డులు ఉన్నా... జాబితాలో పేరు ఉండటంలేదు. ఓటు ఉందో లేదో తెలుసుకునేందుకు ఆన్​లైన్​లోనే వెసులుబాటు కల్పించింది ఎన్నికల సంఘం. ఇది తెలియని చాలా మంది తహశీల్దార్ కార్యాలయాల చుట్టు తిరుగుతున్నారు. 1950 నెంబర్‌ సరిగా పని చేయడం లేదని ప్రజలు వాపోతున్నారు. ఇన్ని ప్రయత్నాలు చేసిన కొందరు ఫారం-6 నింపేందుకు మొగ్గుతున్నారు. అలాంటి వారందరితో మీసేవా కేంద్రాలు కిక్కిరిసిపోతున్నాయి.
పనిలో పనిగా ఫారం-7 కిందా దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. ఈ అర్జీలను అధికారులు క్షణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఒక్క పశ్చిమగోదావరి జిల్లాలో 38వేల ఫారం-7 దరఖాస్తులు వచ్చాయి. వీటిపై పూర్తిస్థాయిలో అధికారులు విచారించారు. కేవలం 17వందల దరఖాస్తులే అర్హమైనవి తేల్చారు. మిగిలినవి ఓటరు ప్రమేయం లేకుండా పెట్టినవేనని తేలింది. బోగస్ దరఖాస్తులపై 38 కేసులు నమోదు చేశారు. ఫారం-7 దరఖాస్తులను క్షణ్ణంగా పరిశీలించి... పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి, రీఎంట్రీలు ఉంటే తొలగిస్తున్నామని బూత్ స్థాయి అధికారులు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి:ఎన్నికల్లో అలసత్వానికి తావివ్వకండి : కలెక్టర్ ప్రవీణ్ కుమార్


పశ్చిమగోదావరిజిల్లాలో ఓటర్ల జాబితా తప్పులతడకగా మారింది. బతికున్నవాళ్ల ఓట్లనే తొలగించారు. చనిపోయారంటూ కారణం చూపారు. కొందరి ఓట్లు రెండేసి పోలింగ్ బూత్ కేంద్రాల్లో ఉన్నాయి. ఓటరు గుర్తింపు కార్డులు ఉన్నా... జాబితాలో పేరు ఉండటంలేదు. ఓటు ఉందో లేదో తెలుసుకునేందుకు ఆన్​లైన్​లోనే వెసులుబాటు కల్పించింది ఎన్నికల సంఘం. ఇది తెలియని చాలా మంది తహశీల్దార్ కార్యాలయాల చుట్టు తిరుగుతున్నారు. 1950 నెంబర్‌ సరిగా పని చేయడం లేదని ప్రజలు వాపోతున్నారు. ఇన్ని ప్రయత్నాలు చేసిన కొందరు ఫారం-6 నింపేందుకు మొగ్గుతున్నారు. అలాంటి వారందరితో మీసేవా కేంద్రాలు కిక్కిరిసిపోతున్నాయి.
పనిలో పనిగా ఫారం-7 కిందా దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. ఈ అర్జీలను అధికారులు క్షణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఒక్క పశ్చిమగోదావరి జిల్లాలో 38వేల ఫారం-7 దరఖాస్తులు వచ్చాయి. వీటిపై పూర్తిస్థాయిలో అధికారులు విచారించారు. కేవలం 17వందల దరఖాస్తులే అర్హమైనవి తేల్చారు. మిగిలినవి ఓటరు ప్రమేయం లేకుండా పెట్టినవేనని తేలింది. బోగస్ దరఖాస్తులపై 38 కేసులు నమోదు చేశారు. ఫారం-7 దరఖాస్తులను క్షణ్ణంగా పరిశీలించి... పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి, రీఎంట్రీలు ఉంటే తొలగిస్తున్నామని బూత్ స్థాయి అధికారులు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి:ఎన్నికల్లో అలసత్వానికి తావివ్వకండి : కలెక్టర్ ప్రవీణ్ కుమార్

New Delhi, Mar 12 (ANI): Soon after the Bharatiya Janata Party (BJP) held an election manifesto committee meeting in the national capital, BJP MP Bandaru Dattatreya said that during the meeting discussion was held on varied topics. He said, "National security, ram temple, health education etc were the main topics discussed and future plans will be finalised under the leadership of Rajnath Singh." The meeting was chaired by Union Home Minister Rajnath Singh and Union Minister of Minority Affairs Mukhtar Abbas Naqvi, Minister of State (MoS) for Prime Minister's Office (PMO) Jitendra Singh, Union Minister of Science and Technology Harsh Vardhan were also present in the meeting.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.