ETV Bharat / state

రఘురామకృష్ణరాజుపై తణుకు ఎమ్మెల్యే వ్యక్తిగత కార్యదర్శి ఫిర్యాదు

author img

By

Published : Jul 10, 2020, 1:26 AM IST

పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పార్లమెంట్ సభ్యుడు కనుమూరి రఘురామకృష్ణరాజు పై తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు వ్యక్తిగత కార్యదర్శి పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు.

west godavari dist
నరసాపురం ఎంపీ కనుమూరు పై తణుకులో ఫిర్యాదు

పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ఎంపీ కనుమూరి రఘురామకృష్ణరాజుపై తణుకు పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు నమోదైంది. తణుకు ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు వ్యక్తిగత కార్యదర్శి ప్రసాద్ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. శాసనసభ్యుడు నాగేశ్వరావుపై అసత్య ఆరోపణలు చేసి, ఆయన పేరు ప్రతిష్ఠలకు భంగం కలిగించేలా రఘురామకృష్ణరాజు వ్యాఖ్యానించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

సింహం సింగిల్​గా వస్తుందని పేర్కొంటూ శాసనసభ్యుని జంతువులతో పోల్చారంటూ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు.

పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ఎంపీ కనుమూరి రఘురామకృష్ణరాజుపై తణుకు పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు నమోదైంది. తణుకు ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు వ్యక్తిగత కార్యదర్శి ప్రసాద్ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. శాసనసభ్యుడు నాగేశ్వరావుపై అసత్య ఆరోపణలు చేసి, ఆయన పేరు ప్రతిష్ఠలకు భంగం కలిగించేలా రఘురామకృష్ణరాజు వ్యాఖ్యానించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

సింహం సింగిల్​గా వస్తుందని పేర్కొంటూ శాసనసభ్యుని జంతువులతో పోల్చారంటూ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇదీ చదవండి జంగారెడ్డిగూడెంలో కరోనా కలకలం.. అప్రమత్తమైన అధికారులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.